ఆఫీసులో వర్క్, టెన్షన్ మానసిక ఒత్తిడి కారణంగా తలనొప్పి అందరికీ వస్తూనే ఉంటుంది.. తలనొప్పి వచ్చిందంటే ఓ పట్టాన తగ్గదు.. ఈ సమస్య నుంచి బయటపడటానికి కొందరు కాఫీ టీ లను ఎంచుకుంటే.. మరి కొంతమంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు.. తలనొప్పికి పెట్టాలి అంటే వీటన్నింటితో ఎప్పుడో ఒకప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తూనే ఉంటాయి.. అలా కాకుండా ఈ సమస్యకు గరికతో చెక్ పెట్టవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..
ఆయుర్వేదంలో గరికకు విశిష్ట స్థానాన్ని కల్పించారు. ఇది అనేక అనారోగ్య రుగ్మతల్ని నయం చేస్తుంది. గరికను వినాయకుడి పూజలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి. గరిక గడ్డి తలనొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తలనొప్పి సమస్యతో బాధపడుతున్న వారు ఒక చంచా గరిక గడ్డి రసంలో, అర చెంచా అతిమధురం పొడి కలిపి రోజుకు రెండు పూటలా తీసుకుంటే తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.
అదేవిధంగా గరికతో పాటు ఎండు ద్రాక్ష, బాదం పప్పులను కలిపి తీసుకున్న తలనొప్పి త్వరగా తగ్గుతుంది.. తలనొప్పి ఎక్కువగా ఉన్నవారు. ఐస్ క్యూబ్స్ పెట్టి తల మీద రుద్దుకుంటే తక్షణ ఉపశమనాన్ని పొందవచ్చు.. ఐదు ఎండుద్రాక్ష, బాదంపప్పులను కలిపి తిని ఆ తర్వాత గోరువెచ్చని పాలను తాగిన కూడా తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది..