Diabetes: సాధారణంగా గృహిణులు ఏ కూర వండినా అందులో కారం వేయడం కామన్.. కారంపోడికి బదులు పచ్చిమిరపకాయలను వాడమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.. కారంపొడి కంటే పచ్చిమిర్చి మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.. పచ్చి మిరపకాయల కి డయాబెటిస్ కి లింక్ ఏంటి అని అనుకుంటున్నారా..!? అదేంటో ఇప్పుడు చూద్దాం..!!
పచ్చిమిరపకాయలలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా లభిస్తాయి. వీటిని రోజుకు కూరలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో చేరిన యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. ఇంకా పచ్చిమిర్చిలో విటమిన్ బి6 , ఐరన్, ఫాస్పరస్ సమృద్ధిగా లభిస్తాయి. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా ఇది దోహదపడతాయి. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ పచ్చి మిరపకాయలను తినడం మంచిది. కూరలో కారం బదులు వీటిని ఉపయోగించడం వలన రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. ఫలితంగా డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
Read More: Diabetes: డయాబెటిస్ ఉన్నవారు కూడా స్వీట్స్ తినవచ్చు..!! ఇలా తినాలి..!!
పచ్చిమిరపకాయలు డయాబెటిక్ రోగులకు మంచి చేయడంతోపాటు క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడంలో, చర్మకాంతిని పెంపొందించడంలో కూడా సహాయపడతాయి. బరువు తగ్గేందుకు కూడా పచ్చిమిరపకాయలు సహాయపడతాయి కూరలో కారం బదులు పచ్చిమిరపకాయలు వాడడం ప్రారంభిస్తే కొవ్వును కరిగించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి ఫలితంగా బరువు తగ్గుతారు. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఆకలిని పెంచడానికి ఇవి దోహదపడతాయి. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు మీ కూర లో కారం బదులుగా పచ్చిమిరపకాయలు వాడితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.