Marriage Registration: భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం వివాహాల నమోదు తప్పనిసరి చేయాలని ఆదేశిస్తూ 2006 ఫిబ్రవరి 14వ తేదీన మార్గదర్శకాలను జారీ చేసింది. హిందూ వివాహ చట్ట ప్రకారం పెళ్లి చేసుకోబోయే వరుడి కి 21 సంవత్సరాలు, వధువుకు 18 సంవత్సరాలు కచ్చితం గా నిండి ఉండాలి.
Marriage Registration: వివాహం నమోదు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం..
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ల్లో వివాహ నమోదు ఎప్పటినుంచో జరుగుతుంది. పురపాలక సంఘాల్లో కూడా వివాహ నమోదుకు ప్రత్యేక సిబ్బంది ఉంటారు. గ్రామ పంచాయతీలలో కూడా నమోదు చేసుకోవచ్చు. వివాహానికి ముందుగానే వివాహ సమాచారాన్ని పంచాయతీ కార్యదర్శికి అందజేస్తే నిర్ణీత రుసుం తీసుకుని దరఖాస్తు ఫారం ఇస్తారు. ముగ్గురి సాక్షి సంతకాలతో పంచాయతీ కార్యదర్శి, పురపాలక ప్రత్యేక ఉద్యోగి వివాహ ధ్రువీకరణ పత్రం అందచేస్తారు. పెళ్లై చాలా కాలం అయిన వారు కూడా నమోదు చేసుకునే వీలుంది .
రిజిస్ట్రేషన్ కు కావల్సిన పత్రాలు ఇవే…
వధూ వరులు చదువుకున్న వారైతే 10వ తరగతి మార్కుల లిస్ట్, నివాస ధృవీకరణ పత్రం, ఓటరు కార్డు,రేషన్ కార్డు, ఆధార్ కార్డు లో ఏదో ఒకటి ఉండాలి. వాటితో పాటు తాళి కట్టిన, జీలకర్ర బెల్లం పెట్టిన ఫోటోలు కూడా జత చేయాలి . గుళ్లో పెళ్లి చేసుకుంటే ఆలయ అధికారులు కానీ, బాధ్యులు కానీ ధృవీకరణ పత్రం ఇవ్వవలసి ఉంటుంది. వేర్వేరు కులాలు, మతాల వారు వివాహం చేసుకుంటే ముందుగానే సబ్ రిజిస్ట్రార్ కు సమాచారం తెలియ చేయవలసి ఉంటుంది. దీంతోపాటు ఫోటోలు, ముగ్గురు సాక్షుల సంతకాలు ఉండాలి.
ఇలా చేయడం వలన జరిగేది ఇదే
వివాహం నమోదు చేసుకున్న స్త్రీలకు ఏమైనా సమస్యలు వస్తే సులభంగా పరిష్కరించుకోవచ్చు. విడాకులు తీసుకోవాలి అన్న, భరణం పొందాలన్న , పిల్లల సంరక్షణ కోసం, ఆస్తి వివాదాలు,ఇలా వీటిలో అయినా వివాహ ధృవీకరణ పత్రాలను పరిగణనలోకి తీసుకుంటారు.
రెండో వివాహాన్ని అడ్డుకునేందుకు రిజిస్ట్రేషన్ బాగా పనిచేస్తుంది.
ప్రేమ పేరుతో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చు.
శారీరక, మానసిక వేధింపులకు,వరకట్న వేధింపులు, గురిచేసే భర్తలు, వారి కుటుంబ సభ్యుల పైన ఫిర్యాదులకు ఉపయోగపడుతుంది.
పాస్ పోర్ట్ పొందేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
వివాహ ధృవీకరణ పత్రం మన దేశంతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా ఉపయోగపడుతుంది.కాబట్టి ప్రతి ఒక్కరు వివాహం రిజిస్టర్ చేసుకోవడానికి నిర్లక్ష్యం చేయకూడదు.