సాధారణంగా పల్లీలను వేరుశెనగ కాయలు అని కూడా అంటారు. భారతదేశంలో ఎక్కువగా పండే పంట, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ వేరుశెనక్కాయలను ప్రధానంగా వంటనూనె కోసం ఉపయోగిస్తారు. పల్లీలను ఇంగ్లీషులో గ్రౌండ్ నట్స్ అని కూడా అంటారు. పల్లీలను మన నిత్య ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటాం.
ఈ వేరుశనగ పప్పు లో అధిక మొత్తంలో మాంసకృత్తులు లభ్యమవుతాయి. ఒక కోడిగుడ్డులో దొరికే ప్రోటీన్ కన్నా వేరుశెనగపప్పు లో ఉండే ప్రోటీన్ ఎక్కువ అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మన శరీరానికి అవసరమైన A,E విటమిన్స్ అధిక మొత్తంలో లభ్యమవుతున్నాయి. మన దక్షిణ భారత దేశంలో తయారుచేసే అత్యుత్తమ తీపి వంటకాలలో పల్లి చిక్కీ ఒకటి. దీనిని వేరుశనగ చిక్కి అని , మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పల్లిపట్టి లు అని కూడా అంటారు.
ఈ తీపి వంటకాన్ని పల్లీలను బెల్లంతో కలిపి తయారు చేస్తారు.మన గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యకరమైన రుచికరమైన చాక్లెట్ కు ఈ పల్లిచిక్కీ నీ ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఈ వేరుశెనగ గింజలను బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీర భాగాలన్నీ ఆరోగ్యంగా సమన్వయంతో పని చేయాలంటే పాస్పరస్, ప్రోటీన్స్ , నియాసిస్ థయామిన్ వంటి పోషకాలు చాలా అవసరం ఇలాంటి పోషకాలు వేరుశెనగ కాయలలో పుష్కలంగా లభిస్తాయి. పెరిగే పిల్లలకు పాలిచ్చే తల్లులకు ఈ పల్లి చిక్కీ లను ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది.
పల్లీలను బెల్లంతో కలిపి తినడం వల్ల ఐరన్ సమృద్ధిగా లభించి ఎముకలు దృఢంగా తయారవుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది , అంతేకాకుండా కంటి చూపుకు అవసరమైన A విటమిన్ కూడా లభిస్తుంది. మన చర్మం ఆరోగ్యవంతంగా ఉండటానికి అవసరమైన E మిటమిన్ ఈ పల్లీల లో లభిస్తుంది. ఈ పల్లి చిక్కులను ప్రతిరోజూ ఆహారంగా తీసుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది.