Banana: అరటిపండు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే.. నెయ్యి కూడా మన శరీరానికి మేలు చేస్తుందని పెద్దలు చెబుతూనే ఉంటారు.. అరటి పండులో నెయ్యి కలిపి తీసుకుంటే బోలెడు లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అరటి పండు నెయ్యి కలిపిన మిశ్రమం పరగడుపున తీసుకుంటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..!
రెండు అరటి పండులను తీసుకొని మెత్తగా గుర్తుచేసుకోవాలి లేదంటే అరటిపండును సన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి అరటిపండు మొక్కలలో రెండు చెంచాల నెయ్యి వేసి కలుపుకోవాలి ఇలా తయారు చేసుకున్న అరటిపండు నెయ్యి మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తీసుకోవాలి ఇలా తీసుకుంటే ఇందులో ఉండే ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్స్ మన శరీరానికి అంది తక్షణ శక్తిని అందిస్తాయి. జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం ను నివారిస్తాయి.
సన్నగా ఉన్నవారు, బరువు పెరగాలంటే ప్రయత్నించేవారు ప్రతిరోజు పరగడుపున అరటి పండును నెయ్యి మిశ్రమాన్ని తీసుకుంటే.. ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరుగుతారు. కండరాలు దృఢంగా మారుతాయి. అధికంగా శారీరక శ్రమ చేసే వారికి ఎంతగానో మేలు చేస్తుంది. పురుషులకు శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. వీర్య కణాలు వృద్ధి చెందేలా చేస్తుంది.