Leaf Plates: ఇప్పుడంటే ప్లాస్టిక్ ప్లేట్స్ భోజనం చేస్తున్నాం కానీ.. ఇదివరకు విస్తరాకులలో మాత్రమే భోజనం చేసేవారు.. విస్తరాకులలో భోజనం చేస్తే అనేక అనారోగ్య సమస్యలను దరిచేరకుండా చేస్తాయి..!! ఏ విస్తరాకులలో భోజనం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!
అరటి ఆకు లో భోజనం చేస్తే సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. కఫ వాత పిత్త దోషములను హరిస్తుంది. ఆకలిని పెంచుతుంది. దంత కాంతిని, శరీర కాంతిని కలిగించును శరీర నొప్పులను తగ్గిస్తుంది. సంబంధిత సమస్యలను దరిచేరనివ్వదు. కడుపులో పుండ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. పెప్టిక్ అల్సర్ ను నయం చేస్తుంది. మోదుగ విస్తరిలో భోజనం చేస్తే రక్త సంబంధిత రోగాలు, పిత్త రోగాలను నశింప చేస్తుంది. బుద్ధిని పెంపొందిస్తుంది. అదే మర్రి ఆకు విస్తరిలో భూజించినచో క్రిమి రోగ నివారణ జఠరాగ్ని వృద్ధి, కుష్టు వ్యాధి నివారణ చేస్తుంది. నేత్ర దోషలను తొలగించును. వీర్య వృద్ధి కలుగును.
పనస ఆకు విస్తరిలో భుజిస్తే వాత పిత్త కఫ దోషాలను హరిస్తుంది. అగ్ని వృద్ధి కలిగిస్తుంది. రావి ఆకు విస్తరిలో భుజించుట వలన పిత్త, శ్లేష్మ నివారణ, అగ్ని వృద్ధి కలుగును. చక్కటి మేధస్సును కలిగిస్తుంది. బుద్ధి బలం చేకూరుతుంది. ఇక చివరిగా వక్క వట్ట ఆకు లో భోజనం చేస్తే వాత పిత్త కఫ రోగాలను నయం చేస్తుంది. ఉదర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.