OM: హిందూ ధర్మంలో ఓం అనే మంత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది.. ఈ ఏకాక్షర మంత్రం ఓం లేదా “ఓమ్” అని కూడా పలుకుతారు.. ఈ మంత్రాన్ని త్రిమూర్తి స్వరూపంగా పెద్దలు చెబుతారు. అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం.. హిందువులు చదివే మంత్రాలలో ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది.. హిందూ మతానికి కేంద్ర బిందువు.. అయితే ఓం అనే మంత్రాన్ని జీవించటం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అని పురాణాలతో పాటు పెద్దలు చెబుతున్నారు..
ఓం అనే మంత్రాన్ని పలకటం వలన తల వరకు శక్తి చేకూరుతుందని.. ఓం పలకినిదే మొదట శక్తి జననావయవాల దగ్గర ఉద్భవిస్తుంది. అనంతరం జీర్ణాశయానికి ఆపై జాతికి అక్కడి నుండి తల వరకు చేరుతుంది ఓం అనే మంత్రాన్ని రోజు పాటించటం వల్ల మన శరీరంలో ఉన్న ఒత్తిడి ఆందోళన, డిప్రెషన్ ని కంట్రోల్ లో ఉంటాయి.. ఓం అనే మంత్రాన్ని క్రమం తప్పకుండా ఉదయాన్నే సంధ్యా సమయంలో పాటించటం వలన ఆరోగ్యానికి ఎంతగానో మేలు జరుగుతుంది.. చిన్నపిల్లలు చదువుకునేవారు ఓం అనే మంత్రాన్ని జపించడం వలన చదువుపై ఏకాగ్రత పెరగడమే కాకుండా మెదడు చురుగ్గా పనిచేస్తుంది.. ఉదయాన్నే సూర్యోదయం సమయంలో శరీరంపై సూర్యరశ్మి పడే విధంగా ఈ మంత్రాన్ని జపించడం వలన శరీరం కాంతివంతంతో పాటు స్వర పేటిక సమస్యలు కూడా రాకుండా చేస్తుంది..
ఓం మంత్రాన్ని రోజు ఉచ్చరించడం వల్ల శరీరంలో పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి అనారోగ్యాలు నయమవుతాయి ఆక్సిజన్ సరఫరా రక్త సరఫరా జరుగుతాయి మెదడుకి కొత్త శక్తి అందుతుంది శరీరంలో కొత్త శక్తి ఉత్సాహం వస్తాయి ఆలోచన శక్తి పెరుగుతుంది కొత్త కొత్త ఆవిరిష్కరణలు చేయగలుగుతారు చురుగ్గా ఆలోచించగలరు ఏదైనా అంశంపై దృష్టి సారిస్తే ధ్యాస తప్పకుండా ఉంటుంది చదువుల్లో చక్కగా రాణిస్తారు ఈ మంత్రం జపించడం వల్ల శరీరం మనసు అన్నీ మన కంట్రోల్ లోకి వస్తాయి అనవసరపు ఆలోచనలు రావు. శరీరం అంతర్గతంగా శుభ్రం అవుతుంది..