Ragi Malt: ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ తమ తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తున్నారు. లాక్ డౌన్, కర్ప్యూ కారణంగా శారీరక శ్రమ లేకుండా ఇళ్లలోనే ఉండిపోతున్నారు. ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తున్నారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంచుకునేందుకు ఎటువంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది అని తెలిసిన వారిని, వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. రోగ నిరోధ శక్తిని పెంపొందించుకుంటే కరోనా లాంటి వైరస్ వల్ల భయపడాల్సిన అవసరం లేదు. కరోనా తొలి దశలో చాలా మందికి కరోనా సోకిన విషయమే తెలియకుండానే వారికి టచ్ చేసి వెళ్లిపోయింది. ప్రధానంగా వారికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల ఎటువంటి లక్షణాలు కనిపించకుండానే తగ్గిపోయింది. ఈ విషయాలు పలు అధ్యయనాల్లోనూ బయటపడింది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ బలవర్థకమైన ఆహారాన్ని తీసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు దరి చేరకుండా చూసుకోవచ్చు.
ఈ సమయంలో శరీరానికి శక్తిని ఇచ్చేవాటిలో రాగులు ఒకటి. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రాగి జావ, రాగి సంకటిగా, రొట్టెలుగా తీసుకునే వారు. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోనూ ఎండా కాలం రాగి జావను తీసుకుంటున్నారు. రాగుల్లో అధికంగా కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు ఏ, బీ, సీ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఎముకల ధృడత్వంగా ఉంచడంలో కాల్షియం సహాయపడుతుంది. విటమిన్ ఏ కంటి జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. విటమిన్ సీ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. రాగి జావ తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోతుంది. బియ్యం కంటే రాగుల్లో కార్పోహైడ్రేడ్లు తక్కువ. పీచు అధికమే. అందుకే రాగులను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా ఏ మాత్రం పెరగవు. రాగులను అంబలిగా, రొట్టెలుగా, సంగటిగా తీసుకుంటే షుగర్ వ్యాధి గ్రస్తులకు మేలు చేకూరుతుంది. శరీర ఉష్ణోగ్రతను కూడా క్రమంగా ఉంచుతుంది. వేసవి కాలంలో చిన్న చిన్న పనులకే ఎక్కువగా అలసట చెందుతారు. అటువంటి సందర్భాలలో తక్షణ శక్తి కోసం రాగి జావ ఎంతగానో ఉపయోగపడుతుంది.
టేస్టీగా రాగి డ్రింక్ ఇలా చేసుకోవచ్చు
రాగి పిండి రెండు టీ స్పూన్లు, నీళ్లు ఒక కప్పు, పాలు – రెండు కప్పులు, పంచదార రెండు టేబుల్ స్పూన్లు, బాదం పొడి రెండు టీ స్పూన్లు, యాలకుల పొడి. శొంఠి పొడి అర టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు. నెయ్యి లేదా వెన్న ఒక టీ స్పూన్ తో టెస్టీగా డ్రింక్ తయారు చేసుకోవచ్చు.