ఎండుద్రాక్ష, తేనే రెండు మన ఆరోగ్యానికి మంచివని తెలిసిందే.. కానీ ఈ రెండింటిని విడివిడిగా తీసుకుంటాం.. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. తేనె ఎండు ద్రాక్ష కలిపి తీసుకుంటే ఎటువంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..!
ఒక కప్పు ఎండుద్రాక్ష తీసుకొని ఒక కప్పున్నర తేనెలో వేసి కలపాలి.. ఈ మిశ్రమాన్ని రెండు రోజులు పాటు కదలనీవ్వకుండా అలాగే ఉంచాలి. తర్వాత నుంచి ప్రతి రోజు ఒక చెంచా చొప్పున పరగడుపున వీటిని తీసుకుంటే.. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.. రక్తహీనత సమస్య తగ్గుతుంది.. శరీరంలో రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది.. ఈ మిశ్రమంలో ఉండే కాల్షియం పాలల్లో కంటే ఎక్కువగా లభిస్తుంది. దీనిని తీసుకోవడం వలన ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. త్వరగా బోన్లు విరిగిపోకుండా చేస్తుంది..
తేనే ఎండుద్రాక్షాలో మిశ్రమంలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు శరీరం అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా అడ్డుకుంటుంది. ఇందులో ఉండే పొటాషియం అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ఈ మిశ్రమం రోజు తీసుకోవడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది.. దాంతో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ మిశ్రమం సహజ శక్తి బూస్టర్ గా పనిచేస్తుంది. నీరసం, నిస్సత్తువ, అలసటను తొలగించి శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది.. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఉదర సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. మలబద్ధకమును నివారిస్తుంది..