Seeds: మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యానికి మంచిది.. ఉదయం అల్పాహారంలో వీటిని తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు దరిచేరవు.. కానీ వీటికి బదులు చాలామంది ఇడ్లీ, దోశ వంటివి తీసుకుంటూ ఉంటారు.. ఉడికించిన ఆహారం తీసుకోవడం వలన అందులో ఉండే పోషకాలను కోల్పోవడంతో పాటు.. వాటిలో ఉప్పు, నూనె జత కలవడంతో ఆరోగ్య సమస్యలు వస్తాయి..! వీటికి బదులు ఇవి గుప్పెడు తినండి చాలు..!
అల్పాహారంలో మొలకెత్తిన విత్తనాలు కు బదులు గుప్పెడు ఈ గింజలు తీసుకోండి. గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం, ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష, వేరుశనగ, పుచ్చ పప్పు ఇవన్నీ తక్కువ ధరకే లభిస్తాయి. వీటిలో కూడా బోలెడు పోషక విలువలు ఉన్నాయి. ఈ విత్తనాలను ఒక్కొక్కటిగా గుప్పెడు చొప్పున తీసుకోవాలి. వీటిని రాత్రి నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయం నానిన ఈ గింజలను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవాలి. ఆ నాన బెట్టిన నీటిని కూడా తాగాలి.
ఇలా గింజలను నానబెట్టిన నీటిని తాగితే రాత్రి అంతా వాటిలో ఉండే పోషకాలు ఆ నీటిలోకి అందుతుంది. అందుకని ఆ నీళ్లు తాగి ఆ గింజలు అన్నింటిని ఉదయం అల్పాహారంగా తీసుకుంటే.. ఆ రోజు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహంను తగ్గిస్తుంది. అధిక రక్తపోటు ను కంట్రోల్లో ఉంచుతుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది . శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించి అధిక బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బరువు పెరగాలి అనుకునేవారు ఈ విత్తనాలను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.