Health: పసుపు లేని వంటిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు.. ఇక పోపుల పెట్టెలో మిరియాలు కూడా.. ఈ రెండింటినీ విడివిడిగా వంటల్లో ఉపయోగిస్తాము.. అయితే ఈ వీటిని కలిపి తీసుకుంటే తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని మీకు తెలుసా..!? ఎలా తెలుసుకోవాలంటే..!?
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు కొద్దిగా నల్ల మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. పసుపు, నల్ల మిరియాల పొడి తో చేసుకున్న గోరువెచ్చటి నీటిని ఉదయం పరగడుపున తాగితే.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నీటిని తాగడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. ఇంకా క్యాలరీలు పూర్తిగా ఖర్చు అవుతాయి. ఫలితంగా కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. దాంతో అధిక బరువు తగ్గుతారు. అంతేకాకుండా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. ఊబకాయంతో బాధపడుతూన్నవారు ఈ నీటిని ప్రతి రోజు ఉదయం తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. త్వరగా బరువు తగ్గుతారు.
Black Pepper: నల్ల మిరియాలు టీ ఈ సమస్యలు ఉన్నవారికి అమృతం..!!
శరీరంలో ఏ భాగంలో నొప్పి ఉన్నా పసుపు, మిరియాలు కలిపి తీసుకుంటే శరీరంలో నొప్పులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.. ఈ రెండింటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఇన్ఫెక్షన్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. ప్రతిరోజు నీటిని తాగితే శరీరంలో ఏ భాగంలోనైనా ఉండే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా పాదాల నొప్పులు ఉన్నవారు ఈ నీటిని తాగితే తక్షణ ఉపశమనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు ఈ నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. డయాబెటిక్ లెవెల్స్ ను నియంత్రణలోకి తెస్తుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?