మన అందరికి అల్లం గురించి శొంఠి గురించి బాగా తెలిసే ఉంటుంది. అయితే చాలా మందికి ఒక అనుమానం ఉండి ఉంటుంది. అది ఏంటంటే పచ్చి అల్లం తింటే ఆరోగ్యానికి మంచిదా లేకపోతే శొంఠే తింటే ఆరోగ్యానికి మంచిదా అనే డౌట్ లో ఉంటారు. నిజానికి అల్లం కంటే శొంఠి తింటేనే మన ఆరోగ్యానికి ఎక్కువ మంచిది. ఎందుకంటే శొంఠి తినడం వలన ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు చేకూరతాయి.అలానే అల్లంలో కూడా ఎన్నో రకాల ఔషద గుణాలుంటాయి.ఇది ఎన్నో రోగాలను నయం చేయడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే దీన్ని ఆయుర్వేదంలో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. మన వంటింట్లో కూడా ఇది తప్పనిసరిగా ఉంటుంది. అల్లాన్ని వంటల్లోనే కాదు టీ లో కూడా వేస్తారు. అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఎన్నో రకాల సమస్యలను తగ్గిస్తుంది.అల్లంతో పోల్చితే శొంఠి ఇంకా మంచిది. మరి ఈ శొంఠి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
ఇమ్మ్యూనిటి పెరుగుదల :
శొంఠి తినడం వలన ఎన్నో రకాల ఫ్లూ లు దూరమవుతాయి. అలాగే శరీరంలో ఇమ్యూనిటీ శక్తి కూడా బలపడుతుంది. జలుబు, దగ్గు నుంచి కూడా ఉపశమనం పొందుతారు.శొంఠిని తీసుకోవడం వల్ల వాతం సమస్య తగ్గుతుంది. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడంలో శొంఠీ బాగా పనిచేస్తుంది.
జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేయడంలో :
శొంఠి తినడం వలన జీర్ణక్రీయ ప్రక్రియ వేగవంతం అయ్యి మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి.అందుకోసం ఉదయం పూట ఒక గ్లాస్ నీటిలో శొంఠిని మిక్స్ చేసి తాగితే మలబద్దకం సమస్య తొందరగా తగ్గిపోతుంది.
జలుబు, దగ్గు నివారిణి :
వానాకాలం, చలికాలంలో జలుబు, దగ్గు ఎక్కువగా వస్తూ ఉంటుంది అలాగే గొంతులో కఫం కూడా ఎక్కువగా పేరుకుపోతుంది.అలాంటి సమయంలో శొంఠి అద్బుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గించడంలో శొంఠి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను కూడా తగ్గిస్తుంది.
బరువును తగ్గించడంలో :
శొంఠి బరువును కూడా సులభంగా తగ్గిస్తుంది. ఇందుకోసం ఉదయం ఖాళీకడుపున ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో కొద్దిగా శొంఠిని వేసి బాగా మరిగించాలి. కాసేపు మరిగిన తరువాత ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా తేనె కలుపుకుని తాగితే బరువు మెల్లగా తగ్గుతారు