మారుతున్న కాలంతో పాటుగా మనుషుల ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కాలంలో వయసుతో పనిలేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే తినే తిండి విషయంలో జాగ్రత్తలు వహించాలి అని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే నానపెట్టిన గింజలను తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చాలా మంది రాత్రిపూట బాదం పప్పులను నానా పెట్టుకుని ఉదయాన్నే తింటూ ఉంటారు. ఇలా తినడం వలన అందులో ఉండే పోషక విలువులు పెరుగుతాయి.
నానపెట్టిన గింజల కలిగే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :
ఇలాంటి ఆహార పదార్ధాలను తరుచు తినడం వలన మనకు శక్తితో పాటు శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.నిజానికి ఇలా నానా పెట్టిన గింజలను ఉదయం పూట తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.మరి ఆ ఆహార పదార్ధాలు ఏంటో చూద్దామా..మొదటగా ఎండుద్రాక్ష గురించి చెప్పుకోవాలి. ఎండు ద్రాక్షను నానబెట్టి తీసుకుంటే అందులో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది.ఇది జుట్టు రాలడం, చర్మ సమస్యలను తొలగిస్తుంది.
బాదం పప్పు :
ఇక బాదం పప్పులను కూడా రాత్రంతా నీటిలో నానా బెట్టి ఉదయాన్నే వాటిపై ఉన్న పొట్టు తీసే తింటే మెదడుకు చాలా మంచిది.ఇలా వీటిని తినడం వలన బరువు కూడా సులభంగా తగ్గుతారు. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ను తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలో బాదం పప్పులు ఎంతగానో సహాయ పడతాయి.
అవిసె గింజలు :
అలాగే అవిసె గింజలలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఈ గింజలను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తింటే ఆరోగ్యానికి మంచిది.
మెంతులు :
మెంతులను కూడా రాత్రంతా నీటిలో నానపెట్టుకుని పొద్దునే తింటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలగడంతో పాటుగా కడుపుకు ప్రయోజనకరంగా ఉంటుంది. మలబద్ధకం తొలగిపోతుంది. దీని కోసం కొన్ని మెంతులని రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో నానబెట్టి ఉదయం తాగాలి