మనం ప్రతిరోజు వంటల్లో ఉపయోగించే చింతపండు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది.కేవలం చింతపండు కూరల్లో రుచిని పెంచడానికి మాత్రమే ఉపయోగిస్తాము అనుకుంటే పొరపాటు పడినట్లే. చింతపండు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.చింతపండులో విటమిన్-సి,విటమిన్-ఎ, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, ఐరన్,ఫైబర్ అధిక సంఖ్యలో ఉంటాయి.. మరి చింతపండు వలన మనకు ఎలాంటి ఉపయోగాలు కల్గుతాయో తెలుసుకుందామా.
చింతపండు వలన కలిగే లాభాలు :
వీటితో పాటు అదనంగా యాంటీ బాక్టీరియల్, యాంటీ డయాబెటిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. చింతపండులో ఉండే ఇనము వలన త్వరగా రక్తహీనత రాదు.
రోగనిరోధక శక్తి పెరుగుదల:
మన శరీరంలో రోగనిరోధక శక్తీ ఎక్కువగా ఉంటాలంటే విటమిన్ ‘సి’చాలా అవసరం.చింతపండులో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
బరువు తగ్గుదల :
చింతపండు తినడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది. మధుమేహా వ్యాధి గ్రస్థులు చింతపండును తింటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అలాగే చింతపండులో టాడ్పోల్స్లో హైడ్రాక్సిల్ ఆమ్లం అధికంగా ఉంటుంది. ఈ ఆమ్లం శరీర కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఫలితంగా త్వరగా బరువు తగ్గుతారు.
చింతపండు ఎవెరెవరు తినాలంటే..?
జ్వరం,జలుబు వచ్చినప్పుడు చింతపండు సూప్లో కొద్దిగా మిరియాలు పొడి వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది.గర్భిణీ స్త్రీలు కూడా చింతపండుతో చెసిన మిఠాయిని తినవచ్చు.ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు గర్భిణీ సమయంలో వచ్చే వాంతులు, వికారాన్ని తగ్గిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అలెర్జీ ఉన్నవారు చింతపండును అసలు తినకూడదు.