నేరేడు పండ్లు గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. నేరేడు పండ్లు తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. అలాగే ఇవి సీజనల్ గా దొరికే పండ్లు కాబట్టి తింటే ఆరోగ్యానికి మంచిది. నేరేడు పండ్లలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
షుగర్ కంట్రోల్ :
నేరేడు పండ్లు షుగర్ వ్యాధిగ్రస్థులకు గొప్ప వరం అనే చెప్పాలి. ఎందుకంటే నేరేడు పండ్లలో అతి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఇవి డయాబెటిక్ పేషంట్లకు చాలా మంచిది. ఇది డయాబెటిక్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి. అలాగే ఈ నేరేడు గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర శాతం తగ్గుతుంది.
గుండె జబ్బులను దూరం చేయడంలో :
నేరేడు పండ్లులో పొటాషియం కంటెంట్ అత్యధికంగా ఉంటుంది . నేరేడు పండ్లను తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడుకు, గుండెకు మంచి ఔషధంగా పనిచేస్తాయి.
దంత సమస్యలను నివారిస్తుంది:
నేరేడు పండ్లలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల దంత సమస్యలు దూరం అవుతాయి. నేరేడు పళ్లను తీసుకొనే వారిలో పళ్లు, చిగుళ్లు సమస్యలు ఉండవు. దంతాలు బలంగా ఉంటాయి.నేరేడు చెట్టు ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మి వేయడం ద్వారా నోటి దుర్వాసన తగ్గుతుంది.
చర్మ సంరక్షణ:
నేరేడు పండ్లను తింటే అందం కూడా రెట్టింపు అవుతుంది. నేరుడు గింజలను పౌడర్ చేసి, ఆపౌడర్ ను పాలతో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి మరుసటి రోజు ఉదయం శుభ్రంగా కడిగితే మొటిమలను నివారించబడుతాయి.నేరేడు పండ్లలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల వృద్దాప్య లక్షణాలు ఆలస్యంగా వస్తాయి.