మనం ఆహారం నమలడానికి ముఖ్యంగా ఉపయోగపడేవి దంతాలు. ఈ పళ్ళు అనేవి సరిగ్గా లేకపోతే నచ్చిన తిండి తినలేము. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది వివిధ రకాల దంతాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. తెల్లగా ఉండాలిసిన పళ్ళు పసుపు రంగులోకి మారిపోవడం, పుచ్చు పళ్ళు రావడం, పళ్ళు ఉడిపోవడం, పళ్ళు గారపట్టడం వంటి అనేక రకాల దంతాల సమస్యలను మనం చూస్తూనే ఉన్నాము.తెల్లగా ఉండాలిసిన పళ్ళు పసుపు రంగులోకి మారిపోతే వాటిని చూడడానికి అసహ్యంగా ఉండటమే కాకుండా నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి ఇలాంటి పళ్లకు సంబందించిన సమస్యల నుంచి బయటపడాలంటే మేము చెప్పే ఈ చిన్న చిట్కాను పాటించి చుడండి. దెబ్బకు మీ పళ్ళు తెల్లగా మిలమిల మంటూ మెరిసిపోతాయి.
తులసి ఆకులతో దంతల సంరక్షణ :
మన అందరికి తులసి చెట్టు గురించి బాగా తెలుసు. ఎందుకంటే తులసి చెట్టుకు మనమందరం ఎంతో పవిత్రంగా పూజలు చేస్తూ ఉంటాము. తులసి ఆకుల వలన మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.అలాగే తులసి ఆకులను ఉపయోగించడం వలన మన పళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతి రోజు 5 లేదా 6 తులసి ఆకులను నమిలి తింటే పళ్ళు తెల్లగా, బలంగా ఉంటాయి. అంతేకాకుండా నోటి దుర్వాసన, చిగుళ్ల వ్యాధులు కూడా నయం అవుతాయి.
తులసి ఆకుల ఉపయోగాలు :
పళ్ల మీద శ్రద్ధ పెట్టాలి లేదంటే చిగుళ్ల సమస్యలు ఎక్కువగా వస్తాయి.తులసి ఆకులలో యూజీనాల్, మిథైల్ యూజినాల్ ఉంటాయి ఇవి పంటి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి.అలాగే తులసి ఆకులలో టెర్పెన్ వంటి యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన నోటిలో క్రిములపై పోరాటం చేసి నోటి ఇన్ఫెక్షన్లను తగ్గించి నోటిని శుభ్రంగా ఉంచుతాయి.
తులసి ఆకులతో టూత్ పేస్ట్ :
తులసి ఆకులను నమలడంతో పాటు తులసి ఆకుల పొడిలో ఆవనూనె కలిపి టూత్ఫేస్ట్గా వాడుకోవచ్చు. తులసి ఆకులను ఎండలో ఎండబెట్టి పొడిగా చేసుకోని ఈ పొడిని టూత్పేస్ట్లో వేసి, రోజుకు రెండు సార్లు పళ్లు శుభ్రం చేసుకోండి.ఇలా చేయడం వలన తులసిలోని సహజమైన బ్లీచింగ్ గుణాలు 7 రోజుల్లో దంతాలను తెల్లగా మారుస్తాయి.అలాగే దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి