Cherry: వర్కవుట్ తర్వాత చాలా మంది శక్తిని కోల్పోయి నట్టవుతారు.. వాళ్లు వెంటనే బలం కావాలన్నా,కండరాల్లో ఎనర్జీ నిండాలన్న చెర్రీ పండ్ల జ్యూస్ తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.చెర్రీ పండ్లు మనుషులలో ఎక్కువ సేపు ఎనర్జీని నిలిచి ఉండేలా చేస్తాయి.రన్నింగ్,సైక్లింగ్, స్విమ్మింగ్, ఇలా ఎక్కువ సేపు శ్రమించే వ్యాయామాలు చెయ్యాలంటే… ఎక్కువ సేపు ఎనర్జీ నిలిచి ఉండేలా చేసే చెర్రీ జ్యూస్ తాగాలంటున్నారు .చెర్రీస్ అమెరికాలో ఎక్కువగా పండుతుంటాయి.వాటి సీజన్ తర్వాత అవి డ్రై ఫ్రూట్స్గా దొరుకుతుంటాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల్లో చెర్రీ పండ్లు పండిస్తున్నారు. .చెర్రీ జ్యూస్ తాగడం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడం తో పాటు జ్ఞాపక శక్తి పెరుగుతుంది.మంచి నిద్ర మీ సొంతమవుతుంది. వీటితో పాటు కంటి చూపు కూడా పెరుగుతుంది అని కొన్ని పరిశోధనలు సైతం తెలియచేస్తున్నాయి.చెర్రీలు చాలా రకాలున్నాయి. డార్క్ రెడ్,బ్లూ,పర్పుల్, ఫ్రూట్స్ ఉంటాయి. ఇంచు మించు అన్నింటిలోనూ సహజ సిద్దమైన తియ్యదనం తో పాటు పొటాషియం,కాల్షియం, లాంటి మినరల్స్ ఉంటాయి. కానీ ఫ్యాట్ మాత్రం ఉండదు.చెర్రీ పండ్లలో ఉండే ఆంథోసియానిన్స్,చర్మం పాడవకుండా రక్షణ కల్పిస్తాయి. షుగర్ ,క్యాన్సర్, లాంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటివి ఉన్నప్పుడు చెర్రీ పండ్ల జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది.కొంతమంది ప్రతి విషయం మర్చిపోతున్నారు. ఒక పనిచేయబోయి మరొక పని చేస్తుంటారు. ఎక్కువగా వృద్ధులలో ఈ లక్షణాలు ఉంటాయి. అలాంటి వారు చెర్రీ పండ్ల జ్యూస్ తాగితే మంచి ఫలితం పొందుతారు.
13 వారాల పాటు, రోజూ చెర్రీ జ్యూస్ తాగడం వలన షార్ట్ టెర్మ్ మెమరీ పవర్ పెంచుకోవచ్చని పరిశోధనలు తెలియ చేస్తున్నాయి. షాపుల్లో కొనుక్కొని చెర్రీ జ్యూస్ని తాగడం కన్నా ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిది అని తెలియ చేస్తున్నారు డాక్టర్లు. ఎందుకంటే రెడీమేడ్ జ్యూస్లలో కలర్స్, స్వీట్నర్స్, షుగర్ వంటివి వేసి తయారు చేయడం వలన అవి శరీరానికి హాని కలిగిస్తాయి. కప్పు చెర్రీ పండ్ల లో గింజలు తీసేసి పావు కప్పు నీరు పోసి జ్యూస్ చేసుకుని తాగవచ్చు.