Health Tips: ప్రస్తుతం చిన్నా, పెద్దా అందరూ ఎక్కువగా కంప్యూటర్, లేదా స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉంటున్నారు. గంటల సమయం కంప్యూటర్ వర్క్ చేయడం, సెల్ ఫోన్ వాడటం వల్ల కంటి చూపు సమస్యలు ఎదురవుతుంటాయి. కంటి సమస్యను విస్మరిస్తే మరింత ప్రమాదకరంగా మారేందుకు అవకాశం ఉంటుంది. కళ్లపై వత్తిడి ఎక్కువైతే మంట, నొప్పి, చూపు కోల్పోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. అయితే కంటి ఆలసట నుండి బయటపడే చిట్కాలు ఉన్నాయి. అవి ఏమిటో ఎలా చేయాలో తెలుసుకుందాం…
Read More: Telangana Congress: కాంగ్రెస్ క్యాడర్ కు గుడ్ న్యూస్ అందించిన టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి ..
Health Tips: ఇవి పాటించండి
- కంటిలో నొప్పిగా అనిపిస్తే ఆరో నీటిని వేడి చేసి అందులో దూదిని నాన బెట్టాలి. ఆ తరువాత ఈ నీటిలోని దూదిని తీసి కళ్లకు పట్టించాలి. అవసరమైతే కళ్లపై కొద్దిసేపు కూడా ఉంచుకోవచ్చు. ఇలా చేస్తే ఉపశమనం లభిస్తుంది.
- కళ్లపై ఒత్తిడి నివారించడానికి కంప్యూటర్ లు లేదా ఇతర గాడ్జెట్ లలో డార్క్ మోడ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో అప్పుడప్పుడు కంటి రెప్ప వేయకపోయినా, కళ్లు స్ట్రెయిన్, డ్రైనెస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే కంప్యూటర్ పై పని చేసే సమయంలో కొద్ది సేపు విరామం తీసుకోవాలి. కళ్లు పొడిగా అనిపిస్తే కంటి చుక్కల మందు ఉపయోగించడం శ్రేయస్కరం.
- ఎక్కువ మంది కళ్ల అలసట పొగొట్టడానికి చల్లని నీళ్లతో కడుగుతుంటారు. ఇది శ్రేయస్కరమే. అయితే కళ్లపై నేరుగా ఐస్ ను పెట్టకూడదు. ఏదైనా గుడ్డ (క్లాత్) తీసుకుని కంటి రెప్పలు మూసి ఐస్ ను పెట్టుకోవచ్చు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?