బొప్పాయి పండు అంటే పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఎంతగానో ఇష్టపడతారు. బొప్పాయి పండు రుచిలో ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు. అలాగే బొప్పాయి పండులో పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. బొప్పాయి పండు తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే బొప్పాయి. పండును తినేసి అందులో ఉండే విత్తనాలను సాధారణంగా మనలో చాలా మంది బొప్పాయిని తిని బొప్పాయి గింజలు పాడేస్తూ ఉంటారు.నిజానికి బొప్పాయి గింజలలో ఎన్నో రకాల పోషకాలతో పాటుగా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.కానీ బొప్పాయి గింజలు మన ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తాయో అనే విషయం మనలో చాలా మందికి తెలీదు.మరి బొప్పాయి గింజల వలన మనకు ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో తెలుసుకుందామా..
బొప్పాయి గింజల వలన కలిగే ఉపయోగాలు :
రోజుకి 10 నుంచి 15 బొప్పాయి గింజలను పొడిగా చేసి సలాడ్లు లేదా కూరలలో చల్లుకొని తినవచ్చు.బొప్పాయి గింజలను తినడం వలన కిడ్నీ వ్యాధులు నయం అవుతాయి. అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది. అంతేకాకుండా బ్యాక్టీరియల్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి
బరువు తగ్గడంలో :
ఎవరికయినా కీళ్ల నొప్పులు,మంట, నొప్పి వంటివి ఉంటే అవన్నీ కూడా బొప్పాయి గింజలు తింటే నెమ్మదిగా తగ్గుతాయి జీర్ణ సమస్యలను, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే ఈ కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక పావు టీ స్పూన్ లో సగం బొప్పాయి గింజల పొడిని వేసుకుని అందులో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ఉదయం సమయంలో తాగితే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.
వ్యాధినిరోధక శక్తి పెరుగుదల :
బొప్పాయి గింజలలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి కావున వాటిని తినడం వలన శరీరంలో ఉండే హానికారక బ్యాక్టీరియా బయటకు పోతుంది.అలాగే శరీరంలో రోగనిరోధకశక్తి కూడా అధికం అవుతుంది.అయితే ఈ గింజలను మరి ఎక్కువగా కాకుండా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి.