Healthy Drink: శీతాకాలంలో వాతావరణం మార్పుల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఆస్తమా ఆయాసం, ఉబ్బసం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం ముఖ్యం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే డ్రింక్ తయారు చేసుకుని తాగితే ఈ సీజన్ లో వచ్చే అన్ని సమస్యలకు చెక్ పెడుతుంది..!! ఇంతకీ ఆ కషాయం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!
ఈ కషాయం కోసం 5 లవంగాలు, 6 మిరియాలు, 10 తులసి ఆకులు, సన్నగా తరిగిన చిన్న అల్లం ముక్క ఒకటి అవసరం. ముందుగా ఒక బాండీ తీసుకుని అందులో ఒక గ్లాసు నీటిని పోయాలి. ఇందులో పైన చెప్పుకున్న పదార్థాలు అన్ని వేసుకుని ఐదు నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ నీరు బాగా మరిగిన తర్వాత ఈ నీటిని ఒక గ్లాసు లోకి వడపోసుకోవాలి. ఇలా వడపోసుకున్న ఈ నీటిలో ఒక స్పూన్ తేనె కలపాలి. అంతే ఈ కషాయం తాగడానికి సిద్ధం.
ఈ కషాయాన్ని వేడి వేడిగా రోజుకు ఒకసారి తాగితే జలుబు, దగ్గు ను తగ్గిస్తుంది. గొంతు నొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతులో గురక, శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఆస్తమా, ఉబ్బసం, ఆయాసం వంటి సమస్యలను ధరి చేరనివ్వదు. ఒక వేళ ఆస్తమా ఎక్కువగా ఉంటే మాత్రం రోజుకు రెండుసార్లు ఈ డ్రింక్ తాగండి. ఇందులో ఉపయోగించిన అన్ని పదార్థాలు శీతాకాలంలో వచ్చే వ్యాధులను అడ్డుకుంటాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?