సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అని మన పెద్దలు ఊరికే అనలేదు.. ఎందుకంటే మనకు ఉన్న అన్ని అవయవాల్లో కెల్లా కళ్ళు చాలా ప్రధానమైనవి.కను చూపు లేకుండా మనం బాహ్య ప్రపంచాన్ని చూడడం చాలా కష్టం. కళ్ళు లేని జీవితాన్ని అసలు ఉహించుకోవడమే చాలా కష్టం.మరి మన జీవితంలో అంత ముఖ్యమైన కళ్ళను కాపాడుకునే విషయంలో మనం చాలా జాగ్రత్తలు పాటించాలి.లేదంటే కనుచూపు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.కాబట్టి కళ్ళను కలకాలం ఆరోగ్యంగా ఉంచుకోవడం మన కర్తవ్యం.మన కంటి యొక్క ఆరోగ్యం మన జీవనశైలి,ఆహారపు అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది.మనం తీసుకునే ఆహారం ఎంత పోషకమైనదిగా ఉంటే మన కళ్లు కూడా అంతే ఆరోగ్యంగా ఉంటాయి. మరి కళ్ల ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్ధాల గురించి తెలుసుకకుందామా.
క్యారేట్ :
కంటి చూపును పెంచడంలో క్యారెట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది ఎందుకంటే క్యారెట్ లో విటమిన్ ఎ మరియు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండు కూడా కంటి యొక్క ఆరోగ్యాన్ని,చూపును పెంచుతాయి.
బొప్పాయి :
బొప్పాయి పండులో ఉండే విటమిన్-సి, ఏ కళ్లకు ఎంతగానో మేలు చేస్తాయి. అలాగే కంటి ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్ బొప్పాయిలో పుష్కలంగా ఉంటాయి.కంటి సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే తప్పకుండా బొప్పాయి పండును తినాలిసిందే.
చేపలు:
చేపలు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో మన కళ్ళకు కూడా అంతే మంచిది.ముఖ్యంగా సాల్మన్ చేపను తింటే కళ్లకు చాలా మేలు జరుగుతుంది.ఎందుకంటే చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ను అధికంగా ఉంటాయి. వీటినే హెల్తీ యాసిడ్స్ అని కూడా అంటారు.వీటిని తీసుకోవడం వల్ల కళ్ల వెనుక భాగం, రెటీనా ఆరోగ్యంగా ఉంటాయి.
ఆకుపచ్చని కూరలు :
నిత్యం ఆకు కూరలు తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకంటే ఆకుపచ్చని కూరల్లో విటమిన్-సి, ఇ, ఏ అధికంగా ఉంటాయి.ఇవి. కంటి. యొక్క ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.కాబట్టి మీరు తీసుకొనే డైట్లో తప్పకుండా ఆకు కూరలు ఉండేలా చూసుకోవాలి..