చిన్నపిల్లలో సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకనే వారికి దగ్గు, జలుబు, జ్వరం త్వరగా వస్తుంటాయి.మనకు ఇంటిలో అందుబాటులో ఉండే ఆహారపదార్దాలతో వ్యాధి నిరోధక శక్తి ఎలా పెంచాలో చూద్దాం..
పెరుగును పిల్లలకు కచ్చితంగా తినిపించడం వలన వారి శరీరంలో ఉండే చెడు బాక్టీరియా నశించిపోతుంది. జీర్ణక్రియ సక్రమం గా జరుగుతుంది. పిల్లల ఎముకలను దృఢంగా ఉంచడం లో పెరుగులో ఉండే కాల్షియం బాగా ఉపయోగ పడుతుంది.
నిమ్మజాతి కి చెందిన బత్తాయి,నారింజ, తదితర పండ్లను పిల్లలకుపెట్టడం వల్ల వాటిలో ఉండే విటమిన్ సి పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, జ్వరం దగ్గు, వంటి శ్వాసకోశ వ్యాధులను రాకుండాకాపాడుతుంది.
పిల్లలకు రోజూ బాదం, జీడిపప్పు, పిస్తాపప్పు తదితర నట్స్ను పెట్టడం ద్వారా వాటిలో ఉండే పోషకాలు వారిలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే పిల్లలు బలంగా ఉంటారు. వారికి సంపూర్ణ పోషణ కూడా లభిస్తుంది. చీటికీ మాటికీ అనారోగ్యాల పాలుకాకుండా ఉంటారు
పిల్లలు విటమిన్ ఎ,మరియు జింక్ పుష్కలం గా పొందాలంటే వారు నిత్యం క్యారెట్లను తినేలా చూడాలి. క్యారెట్లతో కంటి చూపు పెరుగుతుంది. శరీరం లో రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లకు దూరం గా ఉంటారు.
బ్రెడ్, జావ వండిన మెత్తటి కూరగాయలు
బ్రేక్ ఫాస్ట్గా ఇడ్లీ, రాగి జావ, బ్రెడ్, వీటిలో ఏదో ఒక దానితో పాటు పాలు ఒక గ్లాసు, మధ్యలో ఒక పండు, మధ్యాహ్నం ఆహారం లో అన్నం లేక చపాతీ, పెరుగు, పప్పు ,కూరగాయలు, మెత్తగా వుడికించి వండిన మాంసాహారం ఇవ్వొచ్చు.
సాయంత్రం వేయించిన పల్లీలు, పాలు, లేదా ఉడకబెట్టిన శనగలు, గుడ్డు లేక అరటిపండుఇవ్వాలి. రాత్రి భోజనం లోకి అన్నం ,కూరగాయలు, రాత్రి పడుకోబేయే ముందు పాలు ఇవ్వడం వలన పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.