Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి, వీటితో రకరకాల వంటలు చేస్తూనే ఉంటాం.. ఇక పీనట్ బటర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇది లేకుండా ఏ స్నాక్ కంప్లీట్ అవ్వదు.. మరి పీనట్ రైస్ ఎప్పుడైనా ట్రై చేశారా.. ఒకసారి ఇలా చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..! పీనట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!
పీనట్ రైస్ తయారీ విధానం..
కావలసిన పదార్థాలు..
ఒక కప్పు బియ్యం, ఒక కప్పు కొబ్బరి పాలు, అరకప్పు కొబ్బరి తురుము, నువ్వులు రెండు చెంచాలు, సన్నగా తరిగిన అల్లం ఒక చెంచా, జీలకర్ర ఒక చెంచా, నిమ్మకాయ ఒకటి , ఎండుమిర్చి నాలుగు, కరివేపాకు కొద్దిగా, నూనె రెండు చెంచాలు, ఉప్పు రుచికి సరిపడా..
ముందుగా బియ్యం కడిగి అందులో ఒక కప్పు కొబ్బరి పాలు, ఒక కప్పు నీళ్లు పోసి అన్నం వండుకోవాలి.. ఇప్పుడు పొయ్యిపై బాండి పెట్టి జీలకర్ర, ఎండుమిర్చి, వేరుశనగపప్పులు దోరగా వేయించుకోవాలి.. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వీటన్నింటినీ వేసి కొబ్బరి తురుము కూడా వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి..
ఇప్పుడు స్టవ్ పై ఒక పాత్ర పెట్టుకుని అందులో తాలింపు వేసుకోవాలి.. రెండు నిమిషాలు నూనె వేసుకొని పోపు గింజలు జీలకర్ర ఎండుమిర్చి అల్లం ముక్కలు నువ్వులు కరివేపాకు వేసి వేయించుకోవాలి.. ఇందులోనే ముందుగా సిద్ధం చేసుకుని పెట్టుకున్న పల్లీల పొడి కూడా వేసి కలపాలి.. ఈ మిశ్రమంలో ముందుగా ఉడికించుకున్న అన్నం తీసుకువచ్చి కలపాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం పిండుకొని కొత్తిమీర, కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకోవాలి.. అంతే పీనట్ రైస్ తినటానికి రెడీ.. ఈ రైస్ పిల్లలకు అందించడం వలన పిల్లలు చక్కగా ఎదుగుతారు.. వారి బలానికి ఈ రైస్ సహాయపడుతుంది.. జ్ఞాపకశక్తి మెరుగు అవుతుంది..