Pregnancy: గర్భం తో ఉన్నప్పుడు తల్లి మంచి మాటలు వినాలి.. ప్రశాంతం గా ఉండాలి అని మన పెద్దలు చెబుతుంటారు దానికి కారణం ఏమిటంటే తల్లి గర్భంలో ఉన్న శిశువుకు మాటలు వినిపిస్తాయి, అర్ధమవుతాయి అన్న విషయాన్ని పురాణ కథనాలు అనేకం మనకు చెబుతున్నాయి. ఇవి అతిశయోక్తి కాదు, ఇందులో నిజం ఉంది అని ఉదాహరణ తో సహా తెలియజేశాయి మన ధార్మిక గ్రంధాలు.
అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండగానే పద్మవ్యూహం గురించి అవగాహన చేసుకున్నాడని భారతంలో చెప్పబడింది.
అలాగే హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు కూడా తల్లి గర్భంలో ఉండగా నారదుని మాటలు విని అర్ధం చేసుకున్నారు అని , అందువల్లనే పుట్టుకతోనే విష్ణు భక్తుడు అయ్యాడు అని తెలియజేస్తుంటారు. నారదుడు లీలావతికి చేసిన ఉపదేశం ఆమె కన్నా , ఆమె గర్భంలో పెరుగుతున్న ప్రహ్లాదునికి ఎక్కువ ఉపయోగపడతాయి.నేర్చుకోవడం అనేది గర్భస్థ శిశువు గా ఉన్నప్పుడు ప్రారంభమవుతుందని ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా అనేక పరిశోధనలు చేసి రుజువు చేశారు. కడుపులో ఉన్న పిండానికి ముందుగానే వినికిడి శక్తి వస్తుంది అని , దాంతో తల్లితో ఇతరులు మాట్లాడే మాటలు, తల్లి ఇతరులతో చెప్పే సంగతులు విని గ్రహించగలుగుతారు అని నిపుణులు, మనస్తత్వ శాస్త్రజ్ఞులు తెలియచేస్తున్నారు .
గర్భస్థ శిశువు మన మాటలు వింటుంది, అర్ధం చేసుకుంటుంది కనుక గర్భిణీ స్త్రీలు వీలైనంత ప్రశాంతంగా ఉండమని, ఆవేశాలు, చెడ్డమాటలు ,అరుపులకు దూరంగా ఉండమని సూచిస్తారు. మంచి మాటలు వింటూ, ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగే శిశువు అంత ఆరోగ్యంగా పుట్టి పెరుగుతుంది అని తెలియ చేస్తున్నారు అంత మంచి వ్యక్తులుగా కూడా ఎదుగుతారు. మీకు భక్తి ఉంటే మీకు ఇష్టమైన దైవం శ్లోకాలు ,పాటలు ,ప్రవచనాలు వింటూ ఉంటే మంచిది. లేదంటే మంచి పాజిటివ్ విషయాలు,మంచి కథలు వింటూ ఉంటే మంచిది. అలా పాజిటివ్ గా ఎదిగిన బిడ్డ పుట్టి పెరిగి మంచి వ్యక్తి అవుతాడు.