High BP: మనిషి శరీరానికి ఆహారం కంటే అతి ముఖ్యమైనది నీరు.. శరీరంలో సరిపడా అంతా నీరు లేకపోతే బాడీ డిహైడ్రేషన్ కి లోనై కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. ఆరోగ్య నిపుణులులు ప్రతి మనిషి డైలీ శరీరానికి తగినంత నీరు తీసుకోవాలని సుమారుగా ఎనిమిది గ్లాసులు నీరు తాగాలని చెబుతున్నారు. అధిక రక్తపోటు ఉన్నవారు మాత్రం తగినంత నీరు మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు..!!
అధిక రక్తపోటు సమస్య వల్ల అనేక రకాల సమస్యలు వస్తుంటాయి.. అందులో భాగంగానే గుండెకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతాయి.. మంచినీళ్లు ఎక్కువగా తాగితే బీపి లెవెల్స్ నియంత్రణలో ఉంచుతాయి.. రక్తపోటు అదుపులో ఉంటే గుండె సమర్థవంతంగా పనిచేస్తూ.. శరీరం మొత్తానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది.. గుండె ఆరోగ్యంగా ఉంటే రక్తపోటుని నియంత్రణలో ఉంచవచ్చు.
అయితే ఇలా అధిక రక్తపోటును నియంత్రించాలంటే మనిషి శరీరానికి తగిన ఆహారము తీసుకుని శారీరక శ్రమ చేయడం వలన కూడా ఈ సమస్యను నివారించవచ్చు.. అంతేకాకుండా మద్యపానము, ధూమపానము చేయకుండా ఉంటే ఈ హైబీపీ నియంత్రణలో ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.. దీనితోపాటు పుష్కలంగా నీరు తాగితే అధిక రక్తపోటు తగ్గుతుందని.. రక్తపోటు సమస్యను తగ్గించడం కోసం నీరు కొంత పరిమాణంలో తరచుగా తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఇలా ప్రతిరోజు 8 గ్లాసులు నీటిని తాగి అధిక రక్తపోటు కు చెక్ పెట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు.