Tamarind : మనం వంటల్లో వాడుకునే పసుపు ,చింతపండు, ఆవాలు, పల్లీలు, మన ఆరోగ్యం మీద వాటి ప్రభావాన్ని చూపుతాయి. అయితే కొన్ని ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ మోతాదు మించి తీసుకోవడం వల్ల లేని పోనీ సమస్యలు వస్తుంటాయి. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.
1. చాలామందికి పులుపు తినడం అంటే మహా ఇష్టం. ఇంకొందరికి పులుపు మాట ఎత్తితే ఊరుకోరు. వంటల్లో వాడే చింతపండు కొంత మోతాదు వరకు అయితే పర్వాలేదు కానీ అంతకు మించితే మాత్రం తలవెంట్రుకలు తెల్లబడిపోతాయి. వయసు కు మించి కనబడుతుంటారు. దీనితో పాటు శరీరం లావై బుద్ధి కూడా మందగిస్తుంది. కాబట్టి ఈ విషయం లో చాలా జాగ్రత్త ఉండాలి.
2. కొందరు పల్లీలు వేరుగా తిని ఆఖరున చిన్న బెల్లం ముక్క తింటుంటారు. ఈ రెండింటి రుచి చాలా బాగున్నప్పటికీ పల్లీలను విడిగా తినకుండా బెల్లంతో కలిపి తింటే (చిక్కీలు )శరీరానికి మంచి శక్తి వస్తుంది.
3. మనం పోవు లో వేసుకునే ఆవాలు చాలా మంది తినకుందాం తీసి పక్కన పెడుతుంటారు. పోపులో వేసే ఆవాలు దురదలు తగ్గించడం తో పాటు శరీర నీరసాన్ని తగ్గిస్తుంది.
4.ఇక జీలకర్ర విషయానికి వస్తే ఇది శరీరం మొత్తాన్ని శుభ్రపరిచే గుణం కలిగి ఉంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.
5. అటు మాంసాహారాలలో ఇటు శాకాహారం లో కూడా కొత్తిమీరను వాడుతుంటాము. దీనివల్ల శరీరం మంచి ఆకృతి లో ఉంటుంది.
6. పసుపును వంటల్లో ఎక్కువగానే వాడుతుంటాము. ఎందుకంటే పసుపు రక్తమును శుభ్రం చేయడం తో పాటు ఉత్సాహమును కలిగించేందుకు అద్భుతం గా పనిచేస్తుంది.
7. మిరియాలు ఘాటుగా ఉండే పదార్థం. ఇదివేసుకోక పొతే రసం టేస్ట్ రాదు.అదే విధం గా దగ్గు, జులుబు తగ్గాలన్న కూడా మిరియాలు వాడుకోవాలి. మిరియాలు గుండెకు చాలా మంచిది. గుండె నొప్పి వంటి సమస్యలు రాకుండా కాపాడతాయి.
8. అల్లం ఆహారం లో తీసుకుంటే జీర్ణాశయాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. దీనితో పాటు పాలు ఇచ్చే తల్లులు తినడం వలన తల్లి పాలు శుభ్ర పడేలా చేస్తుంది.
9. నువ్వులు శరీరంలోని ఎముకలను శక్తిని ఇస్తాయి. తలవెంట్రుకలకు కూడా ఇవి చాలా మంచిది. షుగర్ వ్యాధికి అయితే ఇది మంచి పనిచేస్తుంది.