తెల్లటి మోము పై నల్ల మచ్చలు కాంతి విహీనంగా కనిపిస్తాయి.. మొటిమలు, వాటి తాలూకు మచ్చలు మన అందానికి అడ్డు గోడగా నిలుస్తాయి.. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే మార్కెట్ లో దొరికే వివిధ ప్రొడక్ట్స్ శాశ్వత పరిష్కారం ఇవ్వవు.. మన వంటింట్లో ఈ వస్తువులతో ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
ఈ పేస్ ప్యాక్ తో ఎలాంటి మచ్చలు అయిన ఇట్టే పోతాయి… ఒకసారి ట్రై చేస్తే పోలా
ముందుగా ఈ చిట్కా కోసం ఒక చెంచా ఉప్పు, ఒక స్పూన్ పంచదార , ఒక చెంచా నిమ్మరసం, ఒక స్పూన్ రోజ్ వాటర్ అవసరం. ఒక గిన్నె తీసుకొని అందులో వీటన్నింటినీ వేసి బాగా కలపాలి.. ఇప్పుడు కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ బాదం నూనె కానీ వీటిలో మీకు నచ్చిన నూనె తీసుకోండి.. ఆ నూనెతో ముఖానికి రాసుకొని ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి..
ఇప్పుడు నూనె రాసుకున్నా ముఖం పైన ముందుగా సిద్ధం చేసుకుని పెట్టుకున్న ఉప్పు, పంచదార, నిమ్మ, రోజు వాటర్ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాస్తూ స్క్రబ్ చేసుకోవాలి.. ఇలా ఐదు నిమిషాల పాటు ఆ మిశ్రమాన్ని రాసుకుంటూ మసాజ్ చేసుకోవాలి.. మరో పది నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో ముక్కల్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మొటిమలు వాటి మాటలు తొలగిపోవడంతో పాటు దుమ్ము, ధూళి కూడా తొలగిపోతుంది..