వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో ఎక్కువమంది మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు సమస్యతో బాధపడుతున్నారు.. దీనికి ముఖ్య కారణం శరీరంలో గ్యాస్ పేరుకుపోవడం.. శరీరంలో పేరుకుపోయిన గ్యాస్ బయటకు వెళ్లకపోతే ఎముకల మధ్యలో చేరి రకరకాల నొప్పులకు దారితీస్తుంది.. కీళ్ల నొప్పులు, బలహీనత కు చెక్ పెట్టే ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే సరి..!
ఈ చిట్కా కోసం అర చెంచా వాము, పావు చెంచా సొంటి పొడి, ఒక బిర్యానీ ఆకు అవసరం.. ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులో ఓ గ్లాసు నీటిని పోయాలి ఇందులో వాము, సొంటిపొడి, బిర్యానీ ఆకులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి.. ఈ నీటిని ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈ నీరు మరిగిన తర్వాత ఒక గ్లాసులోకి వడపోసుకోవాలి. ఇందులో అవసరం అనుకుంటే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు.. ఈ నీటిని ఉదయం, సాయంత్రం తాగాలి..
ఈ నీటిని తాగితే శరీరంలో పేరుకుపోయిన గ్యాస్ అంతా కరిగిపోతుంది. ఈ గ్యాస్ తగ్గితే శరీరంలో నొప్పులు తగ్గుతాయి.. కీళ్ల నొప్పుల, మోకాళ్ళ నొప్పులు, నరాల బలహీనతను తగ్గిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు బెల్లం వేసుకోకూడదు. జీర్ణ శక్తికి పెంపొందిస్తుంది. అధిక బరువుకి చెక్ పెడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.