Acidity: ప్రస్తుత యాంత్రిక జీవితంలో మనం తినే ఆహారం వల్ల పొట్ట పై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని వల్ల అనేక సమస్యలు వస్తుంటాయి. కడుపులో నొప్పి, అజీర్తి, మలబద్దకం, మంట, గ్యాస్, ఎసిడిటీ వంటి వాటితో ఇబ్బంది పడుతుంటారు. నిజానికి ఎసిడిటీ సమస్య వల్లనే అన్ని వస్తుంటాయి. అయితే ఎసిడిటీ సమస్యతో బాధపడే వారు వైద్యుడి వద్దకు వెళ్లకుండానే ఇంట్లో నుంచే సమస్య పరిష్కరించుకోవచ్చు. ఎసిడిటీ సమస్య తగ్గించుకునేందుకు అయిదు రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వాము – నల్ల ఉప్పు: ఈ రెండు అందరి ఇళ్లల్లో ఉంటాయి. వాటి పానీయం తయారు చేయడం కూడా ఈజీయే. ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ల వాము వేసి.. అర టీస్పూన్ బ్లాక్ సాల్ట్ వేసి కాస్త మరిగించాలి. ఆ తర్వాత చల్లారిన తర్వాత గొరువెచ్చిని నీటిని తాగితే ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.
నిమ్మరసం – తేనె: నిమ్మకాయలో యాసిడ్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఒక గ్లాసు నీటిలో కాస్త నిమ్మ రసం, ఒక టీస్పూన్ తేనె కలపి తాగాలి. ఈ పానీయంతో ఉదర సంబంధిత సమస్యలు తగ్గించుకోవచ్చు.
జీలకర్ర నీరు: గ్యాస్ను తొలగించడంలో జీలకర్ర చాలా బాగా పని చేస్తుంది. అన్నం తిన్న తర్వాత.. వేయించిన జీలకర్ర గింజలను తేలికగా చూర్ణం చేసి వాటిని ఒక గ్లాసు నీటిలో మరిగించి తాగాలి. లేదా ఒక టీస్పూన్ జీలకర్ర వేసి ఒక కప్పు నీటిలో మరిగించి తాగాలి.
సోంపు వాటర్: సోంపు గింజలను.. భోజనం చేసిన తర్వాత తినడం చాలా మంచిది. ఆ సోంపు గింజలను నీటిలో వేసి.. మరిగించి తాగితే.. ఉదర సమస్యలన్నీ తగ్గుతాయి.
గోరువెచ్చని పాలు: గోరువెచ్చని పాలు కూడా ఆమ్లతను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పేర్కొంటారు. రాత్రి పడుకునే ముందు గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం కూడా చాలా మంచిది. ఇలా కొన్ని రోజుల పాటు తీసుకుంటే ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.