సహజముగా అన్ని వయస్సుల వారికి వచ్చే సాధారణ చర్మ సమస్యలు మొటిమలు, మచ్చలు. ఈ సమస్య కేవలం టీనేజ్ లో ఉన్నవారికి మాత్రమే వస్తాయి అని అనుకుంటుంటాం … కాని కొన్ని సందర్భలలో పెద్దవారి కి కూడా మొటిమల సమస్య కలిగి వాటివల్ల ముఖం మీద మచ్చలు ఏర్పడతాయి.వీటిని పోగొట్టుకోవడం కోసం కొన్ని తేలికయిన చిట్కాలు చూద్దాం.
ఒక అరటి పండుని తీసుకునిమెత్తని గుజ్జులా చేసి అందులో ఒక చిటికెడు పసుపు, అర టీస్పూన్ శనగపిండిని వేసి బాగా కలిపి పేస్ట్లా కలుపుకుని…. దీన్ని ముఖానికి ప్యాక్లా వేసుకుని 10 నిమిషాలు ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం తో ముఖంపై మచ్చలు ,మొటిమలు, తగ్గిపోతాయి.కమలా పళ్ళ తొక్కలను బాగా ఎండ బెట్టి వాటినిపొడిగా చేసుకుని కొంచెం నీరు కలిపి ముఖానికి పట్టించుకుంటే మొటిమలు, వాటి వల్ల వచ్చిన మచ్చలు కూడా పోతాయి.
కొత్తిమీర ను తీసుకుని రసం తీసుకునిఆ రసం లో చిటికెడు ఉప్పు వేసి కలిపి ముఖానికి రాసి అరగంట ఆరనిచ్చిన తర్వాత చల్లటి నీటితో కడిగితే కడిగేసుకుంటే మొటిమలు తగ్గి పోతాయి. అలాగే ఉల్లి రసం రాస్తే మొటిమలు, కాలిన గాయాల తాలూకు మచ్చలు కూడాతగ్గుతాయి. ముందుగా మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. చిటికెడు పసుపును ఒక స్పూన్ శనగపిండిని తీసుకుని కలపండి. ఈ పేస్ట్ కొంచెం చిక్కగా ఉండటం వల్ల ముఖంపై సమానంగా ఉండేటట్లు రాసుకోవాలి. ముఖ్యంగా మొటిమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయాలి. ఇది ముఖంపై ఉండే అదనపు నూనెను పీల్చేస్తుంది. స్కిన్ ను హైడ్రేటెడ్ గా అలాగేశుభ్రం గా ఉంచడానికి ఉపయోగపడుతుంది.