ఆహారం లో ఉప్పు ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బందే. ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా తింటే, అది మెదడులో మంట, నొప్పు, దురదల వంటివి వచ్చేలా చేస్తుందట. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల ప్రకారం, రోజుకు 5 గ్రాముల ఉప్పు తీసుకోవచ్చు.
అయితే, భారతీయులు రోజుకు 11 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నట్లు సమాచారం. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే మూత్ర విసర్జన ఎక్కువగా చేస్తుంటాం. దాహం కూడా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఉప్పు తక్కువగా ఉందో లేదో తెలుసుకోవడానికి రక్త పరీక్ష అవసరం. కొంతమందికి ముఖం, చేతులు మరియు కాళ్ళలో వాపు ఉంటుంది. దీనితో, ఉప్పు ఎక్కువగా ఉందని మీరు గుర్తించవచ్చు.ఆహారం ద్వారా వెళ్లే ఉప్పులోని సోడియం రక్తంలో కలిసి నీటి ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా రక్తం పరిమాణం పెరిగి మూత్రం ఉత్పత్తి కూడా ఎక్కువ అవుతుంది. దీంతో ఎక్కువ సార్లు మూత్రం వస్తుంటుంది.ఉప్పు తినడం తగ్గిస్తే రాత్రి లేచే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని తాజా పరిశోధనలో తేలింది.
ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తం పరిమాణం పెరిగి రక్తపోటు అధికమవుతుంది.లో బీపీ ఉన్న వారు పగలు తీసుకునే ఆహారంలోనే కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకుని తినాలి. రాత్రిళ్లు తక్కువ ఉప్పు తినడం మంచిది.
ఉప్పులో ఉండే సోడియం శరీరానికి చాలా అవసరం. అలాగని మోతాదుకు మించి తీసుకోకూడదు.
శరీరంలోని సోడియాన్ని ఎలా గుర్తిస్తారు అంటే, మూత్రం ద్వారా యూరిన్ ఏ స్థాయిలో బయటకు వెళ్తుందనే దాన్ని బట్టి సోడియం ఎంత తీసుకుంటున్నామో తెలుసుకోవచ్చు . అయితే యూరిన్లోని సోడియం స్థాయిలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒక వ్యక్తి రోజులో ఎంత సోడియం తీసుకున్నాడో తెలుసుకోవడానికి 24 గంటల పూర్తి శాంపిల్ తీసుకోవల్సి ఉంటుంది. రోజూ ఒకే స్థాయిలో సోడియం తీసుకోం. కాబట్టి.. ఒకటి కంటే ఎక్కువ రోజుల్లో సోడియం శాంపిళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. కవాసకీ ఫార్ములా, ఇతర పద్ధతుల ద్వారా సోడియం స్థాయిలను తెలుసుకోవచ్చు.