బాదంపప్పులంటే మనకు చాలా విషయాలే గుర్తుకువస్తాయి. ప్రొటీన్లు, ఖనిజాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ… ఇన్ని పోషకాలు ఉన్న బాదంపప్పులని మించిన బలమైన ఆహారం లేదన్నది బాదంపప్పులను కనీసం నాలుగురెట్ల నీటిలో 10 నుంచి 12 గంటల పాటు నానబెట్టాలి.
ఇలా నానబెట్టిన పప్పులను నీటి నుంచి వేరు చేసి ఫ్రిజ్లో ఉంచితే కనీసం ఓ వారం రోజులు నిలవ ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడు తాజాగా నానబెట్టుకోవడమే మంచి పద్దతి . ఇక మొలకెత్తిన బాదం తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి . మొలకలు కోసం 12 గంటలపాటు నానబెట్టిన బాదం పప్పులను ఒక గుడ్డలో మూటగట్టి ఉంచితే మరో 12 గంటల తరువాత తెల్లటి మొలక కనిపిస్తుంది. ఇలా ఓ రెండుమూడు రోజులు తరువాత మొలకెత్తిన పప్పులను తినవచ్చు.
బాదం పప్పులను రాత్రి పూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల ప్రయోజనాలు ఎక్కువ. బాదం పప్పులను నీటిలో నానబెట్టడం వల్ల అవి మరింత రుచిగా ఉంటాయి. బాదం పప్పు మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరం పోషకాలను పూర్తిస్థాయిలో శోషించుకోకుండా అడ్డుకుంటుంది. నాన బెట్టడం వల్ల దాని ప్రభావం తగ్గి పోషకాలు చక్కగా శరీరానికి చేరతాయిఅందుతాయి.
బాదం పప్పులను నీటిలో నానబెట్టడం వల్ల ఈ తొక్క తేలిగ్గా వచ్చేస్తుంది. రోజూ బాదం పప్పు తింటే అందులోని అసంతృప్త కొవ్వులు ఆకలిని తగ్గిస్తాయి. కడుపు నిండినట్లు అనిపిస్తుంది. కాబట్టి.. ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే అవకాశం లేదు. ఫలితంగా ఎక్కువ కష్టపడకుండానే బరువు తగ్గవచ్చు.బాదం పప్పులను నానబెట్టడం వల్ల మాత్రమే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికిలభించడం తో పాటు వృద్ధాప్య ఛాయల నుంచి కాపాడతాయి. ఇందులోని విటమిన్ B7, ఫోలిక్ యాసిడ్లు క్యాన్సర్తో పోరాడతాయి. ఇవి పుట్టుకతోపాటు వచ్చే లోపాలను సైతం తగ్గించగలవు.