Curd: పెరుగు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే.. ప్రతిరోజు ఒక కప్పు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు కూడా పదేపదే చెబుతూ ఉంటారు.. పెరుగు తోడు వేయాలంటే అందులో కొద్దిగా పెరుగు వేసి తోడు పెట్టడం అందరికీ అలవాటే.. ఎప్పుడూ ఒకే పద్ధతిని కాకుండా పెరుగును ఇప్పుడు చెప్పుకునే పద్ధతుల్లో కూడా తోడు పెట్టవచ్చు.. మరింత టేస్టీగా కూడా ఉంటుంది..!
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో రెండు ఎండు మిరపకాయలు వేయండి. పాలను 4 గంటల పాటు బయట ఉంచండి. పాలు తోడుకున్న తర్వాత ఆ మిరపకాయలను తీసేయాలి. ఇప్పుడు ఆ పెరుగును ఫ్రీజ్ లో ఒక గంట ఉంచాలి. అప్పుడు గట్టిగా అయ్యి రుచిగా ఉంటుంది. పాలు తోడు వేసేటప్పుడు పూర్తిగా క్రీమ్ పాలనే ఉపయోగించాలి. పాలు మరీ ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తోడువేయాలి. తోడు వేసిన గిన్నెని కదిలించకుండా ఉండాలి. పెరుగు తోడు కున్న తర్వాత దానిని రెండు గంటల పాటు ఫ్రిజ్లో ఉంచాలి. పాలు తోడు వేసినప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే పెరుగు చాలా టేస్ట్ గా ఉంటుంది. పైగా పులుపు అస్సలు రాదు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పెరుగు అవసరం లేకుండా పాలు తోడు వేయడానికి మరో అద్భుతమైన పదార్థం నిమ్మకాయ. గోరువెచ్చని పాలలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి 10 గంటల పాటు కదల్చకుండా పక్కనుంచాలి. ఆ తరువాత పెరుగు రెడీ అవుతుంది అలా పెరుగు సిద్ధమైన తర్వాత రెండు గంటల పాటు ఫ్రిజ్లో ఉంచాలి. ఆ తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.