కిడ్నీలు శరీరంలో ఉండే అతి ముఖ్య అవయవాలు. రక్తంలోని వివిధ మలినాలను తొలగించి రరక్తాన్ని శుభ్రపరచడం వీటి ప్రధాన భాద్యత. కిడ్నీలను సులభంగా శుభ్రపరచగల ఒకే ఒక సాధనం మంచినీళ్ళు. దాదాపుగా 8 నుండి 10 గ్లాసుల వరకు ప్రతిరోజు తాగాలి. ఇతరత్రా సమస్యలేం లేకుంటే ఇంకా ఎక్కువ కూడా తాగవచ్చు. నీళ్ళు టాక్సిన్ పదార్థాలను ఫిల్టర్ చేసినట్టుగా తొలగించేస్తుంది.
మూత్రం క్లియర్గా, ఎటువంటి దుర్వాసన లేకుండాఉంటె మీరు సరిపడినన్ని నీళ్లు తాగుతున్నట్టే . లేని ఎడల ఇంకా నీళ్లు తాగవలిసి ఉంటుంది .కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి ముఖ్య కారణం శరీరంలో తగినంత నీరు లేకపోవడం. దాంతో పాటు యూరిన్లో ఎక్కువ యాసిడ్ ఉండటం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా ఈ సమస్యకి దారి తీస్తాయి. తొందరగా కనుక్కుంటే ఈ ప్రాబ్లమ్ని తేలికగా పోగొట్టుకోవచ్చు .రాజ్మా చూడడానికి కూడా కిడ్నీల లాగానే ఉంటాయి. ఇవి కిడ్నీలని క్లెన్స్ చేసి కిడ్నీ లో రాళ్ళని కరిగిస్తాయని అంటారు. రాజ్మా లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు గా ఉన్న మినరల్స్, బీ విటమిన్స్ కిడ్నీలని శుభ్రపరిచి యూరినరీ ట్రాక్ట్ బాగా పనిచేసేలా చేస్తాయి.
రెగ్యులర్ గా యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటూ ఉంటే శరీరం లోని అక్కర్లేని పదార్ధం బైటికి పోతూ ఉంటుంది.దానిమ్మల్లో ఉన్న పొటాషియం వలన దానిమ్మ గింజలు తిన్నా, రసం తాగినా కిడ్నీ స్టోన్స్ నుండి విముక్తి లభిస్తుంది. తులసిలోని డీటాక్సిఫైయింగ్ గుణాలు కిడ్నీలని శుభ్రపరచి, కిడ్నీలోని రాళ్ళని కరిగేలా చేస్తాయి. కిడ్నీలు స్ట్రాంగ్ గా తయారౌతాయి. లెమన్స్ లో ఉన్న సిట్రేట్ వలన కొత్త రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి, ఉన్న రాళ్ళు కరిగిపోతాయి. ఆలివ్ ఆయిల్ వలన కరిగిపోయిన రాళ్ళు స్మూత్ గా బైటికి వెళ్ళిపోతాయి. పుచ్చకాయలో ఉన్న పొటాషియం యూరిన్ లోని ఎసిడిక్ లెవెల్స్ ని నియంత్రిస్తుంది. పుచ్చకాయ రసం లో చిటికెడు ధనియాల పొడి వేసుకుని తీసుకుంటే ఈ సమస్యకి ఈజీ గా చెక్ పెట్టచ్చు. ఎండు ఖర్జూరాలని రాత్రంతా నీటిలో నానబెట్టి పొద్దున్న గింజలు తీసేసి తినడం వల్ల కూడా కిడ్నీ లో రాళ్ళు కరిగిపోతాయి. దీని వల్ల కొత్తగా రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి. ఇందులో ఉన్న మెగ్నీషియం వలన కిడ్నీలు శుభ్రపడతాయి.
వీటితో పాటూ, కీరదోసకాయ రసం, చెర్రీలు, కొబ్బరి నీరు కూడా కిడ్నీ లో రాళ్ళు కరిగిపోయేలా చేస్తాయి. తాజా పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉన్న వాటిని రోజువారీగా తీసుకుంటూ ఉండాలి. ద్రాక్ష, కమలాపండు, అరటిపండు, కివి, అప్రికాట్ లాంటి పండ్లలో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా పాలు, పెరుగులో కూడా పొటాషియం పుష్కలంగానే ఉంటుంది. ముఖ్యంగా వివిధ రకాల బెర్రీస్ కిడ్నీలలో మలినాలను శుభ్రం చేస్తాయి . ఎందుకంటే…. వీటిలో ఉండే క్వినైన్ మెటబాలిజం లో హిప్యురిక్ ఆసిడ్గా మారి కిడ్నీ లను సమర్దవంతంగా శుభ్రం చేస్తుంది. అయితే, ఈ పద్ధతులు పాటించే ముందు మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి సలహా తీసుకోవడంమాత్రం మరిచిపోకండి.