వివాహం అనేది సామాజిక, ఆర్థిక, సంస్కృతీ సంబంధాలను ప్రభావితం చేసే అత్యున్నత వ్యవస్థ. మాటలతో గొడవ రాకుండా చూసుకోవాలి ఎవరో ఒకరు తగ్గాలిప్రేమతో సర్దిచెప్పుకోవాలిఆవేశం హద్దులు దాటితే . మీరే ‘సారీ చెప్పవచ్చు… అది చిన్నతనం ఏమి కాదు. మన్నింపును కోరడం చిన్న తనం కాదు..తప్పు తనదే అయినప్పుడు భర్త తన అహాన్ని, పురుషాధిక్య భావనని పక్కనపెట్టి భార్యకు సారీ చెబితే, అది ఆమెకు ఎంతో స్వాంతననిస్తుంది. ఊరడింపు బలవర్థక ఔషధంలా పనిచేస్తుంది.
భర్త సారీ చెప్పినవెంటనే క్షమించడం వలన బంధం బలపడుతుంది . రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు అని ఎప్పుడు మర్చిపోకూడదు . మాటమాట పెరిగితే జగడాలకు దారితీస్తుంది. అతిగా మాట్లాడే వారే ఎక్కువగా పొరపాటుచేస్తుంటారు.బయటి వ్యక్తులు మనల్ని ఓ మాట అంటే పెద్దగా పట్టించుకోం.కానీ, మన మనస్సుకు దగ్గరగా ఉన్నవారు, ఆత్మీయులు, మన సర్వస్వం అనుకున్నవారు, మనపై కోపగిస్తే.. మనస్సుకు చాలా బాధ కలుగుతుంది. వారు అన్నది చిన్నమాటే అయినా మనకు అంతులేని దుఃఖాన్ని ఇస్తుంది. మరి ఎందుకు ఈ తేడా..?
అది మనం వారిపై పెంచుకున్న నమ్మకం, ప్రేమే ఇందుకు కారణం. అయితే ఇక్కడే మరో విషయం గమనించాలి. మన ఆత్మీయులు మనపై కోపగించుకుంటే.. ఆ కోపంలో కోపాన్ని మాత్రమే మనం అర్థం చేసుకుంటే.. ఆ బంధం బీటలు వారుతుంది. బంధం బీటలు వారటం వలన కలకాలం నిలబడే అవకాశాలను కోల్పోతుంది.
అదే ,మన ఆత్మీయులే మనపై కోపగించుకున్నప్పుడు.. ఆ కోపం వెనుక ఉన్న ప్రేమను అర్థం చేసుకుంటే.. ఆ బంధం ఇంకా ధృడమవుతుంది. పది కాలాలు పదిలంగా ఉంటుంది. మన ఆత్మీయులు మనపై కోప్పడ్డారంటే అది కచ్చితంగా మన మంచి కోసమే అయ్యుంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. పోనీ,అకారణంగా మనపై కోపగించినా వారి కోపం తగ్గినతర్వాత వారికీ విషయాన్ని వివరించి చెప్పండి వారు తప్పకుండ అర్ధం చేసుకుంటారు . లేదా ..ఈ విధం గా సర్దిచెప్పుకోండి … పోనీలే మనవాళ్లే కదా.. చిరాకులో ఉన్నారు , మనల్ని కాకపోతే ఎవరిని అంటారు.. అని కాస్త సంయమనం పాటించాలి. ఆలా పాటించి చుడండి గొప్ప ఫలితాన్ని పొందుతారు .