pregnancy: పసుపులో యాంటీ మైక్రోబియల్ అధిక మోతాదులో ఉంటుంది అనేక రకాల వ్యాధులను నయం చెయ్యడం లో పసుపు ది ముఖ్య పాత్ర అని చెప్పక తప్పదు. పసుపు అంతర్గత గాయాలతో పాటు బయట తగిలిన గాయాలను నయం చేస్తుంది. పసుపు వాడటం వల్ల కేవలం ఆరోగ్యమే కాదు అందం కూడా. పసుపు ను వాడటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం .
పసుపు క్రిమి సంహారిణి. శరీరంపై ఏర్పడే గాయాలకు, పుండ్లకు పసుపు పెడితే సూక్ష్మ క్రిములు చేరకుండా ఉంటాయి . సెప్టిక్ అవ్వకుండా ఉండడం తో పాటు త్వరగా గాయం త్వరగా మానుతుంది.రక్తహీనతతో బాధపడేవారు ప్రతిరోజు పసుపు, త్రిఫల చూర్ణం, నెయ్యి, తేనె ఈ నాలుగు టీ స్పూను మోతాదులో సమానం గా తీసుకుని, వాటన్నిటిని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ప్రతిరోజు తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. అడ్డసరం ఆకుల రసంతో, పసుపు,మీగడ కూడా కలిపి మెత్తగా నూరి.. ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుంటే పొడిదగ్గు తగ్గుతుంది.ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో రక్తస్రావం కనిపిస్తుంటే , లీటర్ నీళ్లలో రెండు చెంచాలు పసుపు వేసి కొంచెం చల్లారాక తాగాలి. రక్తస్రావం తగ్గేంతవరకు ఇలా తాగుతుండాలి. డాక్టర్ సలహా తప్పకుండా పాటించాలి. పసుపు,పెసరపిండిలో కొంచెం నీరు కలిపి ముఖానికి పట్టించి పావుగంట ఆరిన తర్వాత నెమ్మదిగా రుద్ది చల్లని నీటితో కడిగేసుకుంటే ముఖం కాంతి వంతంగా ఉంటుంద.
ఒక స్పూన్ నారింజ తొక్కల పొడి తీసుకుని అందులో పావు చెంచా పసుపు వేసి నీళ్లతో కలిపి రాసుకుని పావుగంట పాటు ఆరనిచ్చి ముఖం కాంతివంతంగా ఉంటుంది.వెన్నలో పసుపు కలిపి రాసుకోవడం వలన కూడా ముఖం మృదువుగా, అందంగా మారుతుంది . అంతేకాకుండా నిమ్మరసం లో పసుపు కలిపి రాసుకుంటే చర్మంపై ఉండే అన్ని రకాల మచ్చలు తగ్గుతాయి. పసుపు,మంచిగంధం, సమానంగా తీసుకుని తేనెతో కలిపి ఫేస్ ప్యాక్గా వేసుకోవడం వలన ముఖం మెరిసిపోతుంది.