Food: ఏదైనా హడావుడిలో ఉన్నప్పుడు లంచ్ బాక్స్ త్వరగా ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు ఈ రైస్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. రుచిగా కూడా ఉంటుంది. మిగిలిపోయిన అన్నం తో కూడా తయారు చేసుకోవచ్చు.
100 గ్రాముల బియ్యం తో వండుకున్న అన్నం
1 పెద్ద ఉల్లిపాయ ని నిలువుగా సన్నని ముక్కల తరుగు
నూనె-టీ స్పూన్
పుదీనా – 1 చిన్న కట్ట
పచ్చిమిర్చి 6,7 తీసుకుని సన్నని చిలకలు గా చేసుకోవాలి
నెయ్యి- 2 టేబుల్ స్పూన్
బిరియానీ ఆకులు -2
దాల్చిన చెక్క-1 ½ ఇంచు
లవంగాలు – 4
యాలకలు -4
గరం మసాలా -1 టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్-1 టీ స్పూన్
పుదీనా పేస్ట్- 3 టీ స్పూన్స్
నిమ్మ రసం- 1 టీ స్పూన్
ఉప్పు – మీ రుచికి సరిపడినంత
మనం తీసుకున్న నెయ్యి-నూనె కలిపి వేడి చేసుకుని, అందులో మసాలా దినుసులన్నీ వేసుకుని వేయించుకున్న తర్వాత…ముక్కలుగా చేసుకున్న పచ్చిమిర్చి , ఉల్లిపాయ, చీలికలు వేసి ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుని అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, ఉప్పు, వేసి ఒక నిమిషం పచ్చి వాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు పుదీనా పేస్ట్ కూడా వేసుకుని నూనె పైకి తేలే దాకా మగ్గా నిచ్చి , నూనె తేలాక పుదీనా ఆకులు కూడా వేసి రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. నచ్చితే ఈ సమయం లోనే నిమ్మరసం వేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు ,ఆఖరున కొన్ని ఫ్రెష్ పుదీనా ఆకులు, ఉంటే ఫ్రైడ్ ఉల్లిపాయలు వేసుకోండి.