కొందరి లో తరుచూఅస్తమానం కాళ్లు, చేతులు లాగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. నడుం కూడా పట్టేస్తూ ఉంటుంది. ఇలా జరగడం వలన చాలా బాధ పడుతుంటారు. ఇలాంటి సమస్య ఎక్కువగా స్త్రీ ల ల్లో ఉంటుంది. అయితే ఇది డి విటమిన్ సరిగా అందక పోవడం వల్లే వస్తుంది. విటమిన్ డి అనే సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది.
డి విటమిన్ లోపం ఎక్కువగా ఉంటే ఎముకలు పెళుసుగా మారి ఊరికే విరిగిపోతుంటాయి. బాగా నీరసానికి గురవుతారు.అయితే ఈ సమస్య స్త్రీ ల లోనే కాకుండా మగవారి లో నూ కనిపిస్తుంది. అయితే యవ్వనంలోఉండగా దీన్నిపట్టించుకోకపోతేవయ్యస్సు అయిపోయాక చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది.
డి విటమిన్ లోపం ఏర్పడడానికి గల కారణం చాలా మందికి తెలియదు.ప్రతి వ్యక్తి శరీరం లో కోలి కాల్సి ఫెరాల్ అనే ఆసిడ్ ఉంటుంది. అది తగ్గితే అనేకరకాల సమస్యల ఎదుర్కోవలిసి ఉంటుంది. విటమిన్ డి. సూర్యరశ్మితో పొందే విటమిన్ గా చెప్తారు. ఉదయం 8.30 లోపు ఉండే సూర్యకిరణాలలో రోజూ కొంత సేపు ఉండడానికి ప్రయత్నం చేస్తే ఈ విటమిన్ ని మనం పొందవచ్చు. శారీరక దారుఢ్యం కలగలన్న, ఎముకలు పటిష్టం గా మారాలన్నా పలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా ప్రతి రోజు మనకు తగిన మోతాదు లో విటమిన్ డి అవసరమవుతుంది.
విటమిన్ డి లోపం కారణంగా ఎముకలు బలహీనంగామారడం, గుండె సరిగా పనిచేయకపోవడం, కండరాలు నొప్పులు లాంటి సమస్యలు కలుగుతాయి.ఈ సమస్యను తగ్గించుకోవాలంటే రోజు ఉదయం, సాయంత్రం ఓ అరగంట సూర్యరశ్మిశరీరానికి తగిలేలా చూసుకోవాలి.ఆహారం విషయంలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి. కాల్షియం అధికంగా లభించే పాలు, పండ్లు, బెల్లం ,పాలకూర, గోంగూర, తీసుకోవాలి.వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్స్ కూడా తీసుకునే ప్రయత్నంచేయాలి.
Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.