పనితో బాగా అలసిపోయినప్పుడు శరీరానికి ఉత్తేజాన్ని,ఉల్లాసాన్నిఅందించేవి టీ, కాఫీలు. బాగా అలసినప్పుడు మళ్లీ కొత్త శక్తి వచ్చి మన పని మనం చేసుకునేందుకు సహకరిస్తాయి. టీ, కాఫీలు తాగే ముందుగా మనలో చాల మంది నీళ్లు తాగుతుంటారు.టీ తాగే ముందు నీళ్లు తాగితే దాని ఫలితం ఎలా ఉంటుందో తెలుసా.. ఏమవుతుందో తెలుసా?
వేడి వేడి టీ ఒకేసారి నాలుక మీద పడటం వల్ల, నాలుక మీద ఉండే సున్నితమైన రుచి కణాలు దెబ్బతింటాయి. కాబట్టి టీ ముందు నీళ్లు తాగడం వల్ల, నాలుక కి అంత వేడి తగలదు. టీ, కాఫీ లు ఎసిడీటీ ని కలిగిస్తాయి. వాటి వల్ల దంతాలు పాడయ్యే ప్రమాదం ఉంది. ఎసిడిటీ వల్ల కడుపు, గొంతులో కూడా సమస్యలు వస్తాయి. నీళ్లు తాగిన తర్వాత టీ, కాఫీలు తీసుకుంటే ఇలాంటి సమస్య ఉండదు.
పీహెచ్ స్కేలు పై 1 నుంచి 14 వరకు స్కోర్ ఉంటుంది. ఒక ద్రవం విలువ 7 కన్నా తక్కువ ఉంటే ఆ ద్రవాన్ని ఆమ్లమని, ద్రవం 7 కన్నా ఎక్కువ విలువ ఉంటే ఆ ద్రవాన్ని క్షారమని అంటారు. అయితే ఖచ్చింతంగా 7 విలువ ఉంటే ఆ ద్రవాన్ని తటస్థ ద్రవమని పిలుస్తారు. ఈ క్రమంలో నే నీటి పీహెచ్ విలువ చూస్తే అది 7 కన్నా ఎక్కువగా, కాఫీ, టీల పీహెచ్ విలువలు 5, 6లుగా ఉంటాయి. కాబట్టి కాఫీ, టీ లు ఆమ్లత్వాన్ని (యాసిడిక్) కలిగి ఉంటాయి.
నీరు క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది.కాఫీ, టీలను తాగితే అవి ఆమ్ల స్వభావం కలిగి ఉండడం చేత మన పొట్టలో అల్సర్లను, పేగుల కు పుండ్ల ను, క్యాన్సర్లను కలిగిస్తాయి. కాబట్టి కాఫి,టీ తాగే ముందు నీటిని తాగితే పొట్టలో ఆమ్ల ప్రభావం తగ్గుతుంది. దీంతో ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. కాబట్టి కాఫీ, టీ లను తాగే ముందు నీటిని తప్పనిసరిగా తాగడం మంచిది .