Water: మనలో చాలామందికి ఉదయాన్నే నిద్ర లేవగానే టీ గాని కాఫీ గాని తాగే అలవాటు ఉంటుంది. అయితే ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే టీ, కాఫీకి బదులుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం తెలియకపోవచ్చు. నిజానికి పొద్దునే టీ, కాఫీలకు బై చెప్పి ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగి ఆ రోజును ప్రారంభించి చూడండి. చాలా ఉల్లాసంగా, ఉత్సహంగా, ఆరోగ్యంగా ఉంటారు. మరి ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా..!..
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రతి రోజూ ఉదయం కాళీ కడుపుతో గోరు వెచ్చని వేడినీళ్లు తాగడం వల్ల జీర్ణశక్తి మరింత బలపడుతుంది. అలాగే ఆహారం కూడా బాగా జీర్ణమవుతుంది. అలాగే మీరు ఫిట్ గా ఉండాలని భావిస్తే ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 1 గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగాలి. వేడి నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే మరి మంచిది.శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.అలాగే గోరు వెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగుపడి హైపీబీ తగ్గుతుంది. జుట్టుకు కూడా రక్త సరఫరా పెరిగి జుట్టు స్ట్రాంగ్గా మారుతుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఉదయాన్నే ప్రతిరోజు గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల మెల్ల మెల్లగా బరువు తగ్గుతూ వస్తారు. మెటబాలిజం రేటు పెరిగి ఒంట్లో ఉన్న కొవ్వు కరిగిపోతుందిగొంతు సమస్యలు ఉన్నవారు కూడా గోరు వెచ్చని నీరు తాగితే ఉపశమనం లభిస్తుంది.అలాగే శ్వాస కోశ సమస్యలు దూరమవుతాయి. మలబద్దకం సమస్య కూడా దూరం అవ్వడంతో పాటు విరేచనం సజావుగా సాగుతుంది.అజీర్ణంతో ఇబ్బంది పడుతున్న వారు గోరు వెచ్చని నీటిని తాగితే ఉపశమనం లభిస్తుంది.