కరోనా కష్టకాలంలో చాలా మంది బయటకు వెళ్లాలంటే బయపడుతుంటారు. ఎక్కడ వారికి కరోనా సోకుతుందోనని.. ఎంత సోషల్ డిస్టెన్స్ పాటించినా కరోనా సోకుతూనే ఉంది. దాంతో వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై డాకర్లు మంచి ఫుడ్ తీసుకుంటే కరోనా మిమ్మల్ని ఏమీ చేయలేదని భరోసానిస్తున్నారు. కాని మంచి ఫుడ్ తీసుకుంటూ ఇమ్యూనిటీని పెంచుకోవాలని సలహాలిస్తున్నారు.
మరీ ముఖ్యంగా జ్యూస్ ల ద్వారా కూడా ఇమ్యూనిటీ పెరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలో ఈ ఆర్టికల్ ను చదివి తెలుసుకోండి.. క్యారెట్, బ్లాక్ పెప్పర్, టర్మరిక్ జ్యూస్ ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట.. మరి అదెలా తయారు చేసుకోవాలంటే.. ఒక క్యారెట్, చిటికెడు, టీ స్పూన్ మిరియాల పొడిని తీసుకుని బ్లెండర్ లో వేసి వాటికి తగినంత నీరు పోసుకుని జ్యూస్ చేసేయండి.
ఈ జ్యూస్ ని పొద్దున్నే తాగితే మంచి ఫలితముంటుంది. దీనితో పాటుగా బీట్ రూట్, క్యారెట్, యాపిల్ జ్యూస్ కూడా ఇమ్యూనిటీని పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీనికి రెండు బీట్ రూట్స్, మూడు క్యారెట్లు, ఒక గ్రీన్ యాపిల్ ను తీసుకుని వాటిని చిన్న ముక్కలుగా కోయాలి. అలాగే అల్లాన్ని చెక్కు తీసి తురుముకోని వీటన్నింటిని బ్లెండర్ లో వేసి జ్యూస్ చేసుకోవాలి. దీనిలో ఒక నిమ్మకాయ రసం కలుపుకోని తాగేయాలి.
అలాగే యాపిల్, ఆరెంజ్, క్యారెట్ జ్యూస్ ను కూడా తాగేసి ఇమ్యూనిటీని పెంచుకోండిలా..ఒక యాపిల్ ను తీసుకుని దాని చెక్కు తీసి ముక్కలుగా చేసుకోవాలి. అలాగే ఆరెంజ్ గింజలు తీసి పెట్టుకోవాలి. దీనితో పాటుగా రెండు క్యారెట్లను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వీటిన్నింటినీ కలుకుని బ్లెండ్ చేయాలి.
పండ్లతో పాటుగా ఈ జ్యూసులు తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఈ జ్యూసులు కేవలం ఫ్రెష్ గా చేసుకుని తాగాలి. అలాగే వీటిలో షుగర్ కలపకూడదు. ముఖ్యంగా వీటిని ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఈ జ్యూస్ లు డైజెషన్ కు బాగా ఉపయోగపడుతుంది. అలాగే బరువు కూడా తగ్గుతారు.