weight : ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది అధిక బరువు అనే చెప్పాలి. అయితే బరువు తగ్గాలనుకునే వారి లో చాలా మంది అన్నం తినడానికి బదులు పండ్లు తింటూ ఉంటారు. పండ్లు ఎక్కువగా తీసుకుంటే బరువు త్వరగా తగ్గుతుంది అనే భావన చాలా మందిలో ఉంది. కానీ కొన్ని పండ్లు తింటే బరువు తగ్గము, పెరుగుతాము. పెరిగే ప్రమాదం మనం డైటింగ్ చేయాలనుకున్నప్పుడు తీసుకునే పండ్ల ను ఎంపిక చేసుకోవటం లో కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలి. డైటింగ్ చేసే సమయంలో ఏ పండ్లు తీసుకోకూడదదో తెలుసుకుందాం.
ఒక కప్పు మామిడి పండులో లో కేలరీలు 99 ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలని అనుకుంటున్న వారు మామిడి పండ్లు తినడం మంచిది కాదు అని చెప్పక తప్పదు.బరువు తగ్గడం గురించి ఆలోచిస్తుంటే, అరటి పండ్లు అసలు తినకూడదు. ఎందుకంటే ఇందులో కేలరీలు చాలా ఎక్కువ. ప్రతిరోజూ 2 నుండి 3 అరటి పళ్ళు తింటే అది ఖచ్చితంగా మీ బరువును పెంచుతుంది అని మరువకండి.ద్రాక్షలో చక్కెర తో పాతుం కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది . 100 గ్రాముల ద్రాక్షలో కేలరీలు 67, చక్కెర 16 గ్రాములు ఉంటాయి. వీటిని ఎక్కువగా తినటం వల్ల బరువు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మాములు ద్రాక్ష కంటే ఒక గ్రాము ఎండుద్రాక్ష ఎక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. ఒక కప్పు ఎండుద్రాక్ష 500 కేలరీల ను కలిగి ఉంటుంది. ఇది ఖచ్చితంగా బరువు పెరిగేలా చేస్తుంది. అందువల్ల, డైటింగ్ చేసేటప్పుడు ఎండుద్రాక్ష వైపు వెళ్లకుండా ఉండటం మంచిది .
అవకాడో లో కూడా అధిక కేలరీలు ఉంటాయి. 100 గ్రాముల పండ్లలో కేలరీలు 160 ఉంటాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. అయినా కూడా ఎక్కువ ఈ పండ్లను తింటే బరువు పెరగటం ఖాయం.