కరోనా సీజన్ నేపథ్యంలో చాలామంది రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం కిలోల కొద్దీ చికెన్, మటన్లు లాగించేస్తున్నారు. వాటికి డిమాండు బాగా పెరగడంతో రేట్లు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, అతి ఎప్పుడూ అనార్థమే అని గుర్తించుకోవాలి. ఈ లాక్డౌన్ టైమ్లో ఆ వెరైటీ ఈ వెరైటీ అని చాలామంది బాగానే నాన్వెజ్ లాగించేశారట. ఇది మంచి విషయమే. కానీ, మింగుడుపడని కొన్ని విషయాలు కూడా తప్పకుండా తెలుసుకోవాలి.
మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ విషయాల గురించి లోతుగా తెలుసుకోవడం చాల అవసరం. పిల్లలు అతిగా నాన్ వెజ్ వంటకాల తిన్నట్లయితే ఎదుగుదలలో సమస్యలు తలెత్తుతాయని లండన్లో గ్లాస్గో యూనివర్సిటీ జరిపిన పరిశోధనల్లో తేలింది.
మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సీరం ఫాస్పేటు స్థాయిలు ఎక్కువై యుక్త వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు వస్తాయట.
మాంసాహారంలోని ఫాస్పేట్ల వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి.
శరీరానికి సమతుల్య ఆహారం అందాలంటే.. మాంసాహారం తక్కువగా, శాకాహారం ఎక్కువగా తీసుకోవాలి అంటున్నారు ఆరోగ్యనిపుణులు.
ఆకు కూరలు, కూరగాయల ద్వారా కూడా ప్రొటీన్ సమృద్ధిగా లభిస్తోంది. కాబట్టి.. మాంసాహారం తక్కువ తిన్నా ఆరోగ్యానికి ఎలాంటి సమస్య ఉండదు.శాఖాహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, ఫ్యాట్పుష్కలంగా లభిస్తాయి.
వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉండాలంటే.. మాంసాహారానికి వీలైన దూరంగా ఉండటం ఉత్తమం అని సూచిస్తున్నారు.
వారానికి రెండుసార్లు మాత్రమే మాంసాహారాన్ని తీసుకోవడం ద్వారా కూడా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలుపుతున్నారు.
అతిగా మాంసం తినడం వల్ల క్యాన్సర్, కాలేయ సమస్యలు కూడా తలెత్తుతాయని నెదర్లాండ్స్లోని ఎరాస్మస్ మెడికల్ సెంటర్ అధ్యయనంలో తేలింది.
అతిగా మాంసం తిన్నట్లయితే.. కాలేయo దెబ్బతింటుందని, భవిష్యత్తులో కాలేయ మార్పిడి సర్జరీలు చేయించుకోవల్సి వస్తుందని నిపుణులు హెచ్చరించారు. వైద్య పరిభాషలో దీన్ని Non-alcoholic fatty liver disease (NAFLD) అంటారు.ఫ్రై చేసిన మాంసం, ప్రాసెస్ చేసిన మాంసం తినకుండా ఉంటే మంచిది. ఇంట్లోనే వండుకుని లిమిట్గా తింటే చాల మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.