ప్రతి ప్రాణి కి నిద్ర అనేది ఎంతో అవసరం . ప్రాణం నిలవాలంటే గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో అలసిన శరీరానికి నిద్ర కూడా అంతే అవసరం. ఎన్నో పనుల తో అలసిన శరీరానికి నిద్ర నూతనోత్సాహం ఇస్తుంది.. ఈ ఆధునిక కాలం లో మనుషులను నిద్రకు దూరం చేయడానికి అనేక సమస్యలు పుట్టుకొస్తున్నాయి.
పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు,ఆధునిఉపకరణాలు ఇలా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. నిద్రలేమి శరీర రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. దీనివలన రోగాలు త్వరగా దాడిచేస్తాయి. నిద్ర లేకపోవడం హై బీ పీ కి కారణమవుతుంది. నిద్ర లేకపోవడం వలన గుండె వ్యాధులు రావడం తో పాటు , ఎముకలు బలం కోల్పోయి పెళుసుగా మారతాయి . దాంతో షుగరు వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేమి మెదడు పై ప్రభావం చూపడం తో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఏకాగ్రతను కూడా కోల్పోతారు.
ఏ విషయం సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేరు. యుక్తవయసు లో వరుసగా కొన్ని రాత్రు లు నిద్ర లేకుండా ఉంటే అది షుగర్ రావడానికి దారి తీస్తుందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. నిద్ర లేమి వలన రక్తం లో గ్లూకోస్ స్థాయిని నియంత్రించే సామర్థ్యం కూడా దెబ్బతింటుంది.నిద్ర లేకపోవడం వలన కారణం లేకుండా ఎదుటివారిపై విరుచుకుపడతారని పరిశోధనల్లో తేలింది.సోషల్ మీడియాకి అలవాటు పడి నిద్రను నిర్లక్ష్యం చేయకుండా హాయిగా నిద్రపోవాలని సూచిస్తున్న నిపుణులు.
ముఖ్యంగా స్త్రీలలో నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయి బరువు పెరిగేందుకు నిద్రలేమి ప్రధాన కారణంగా నిపుణులు గుర్తించారు. రోజుకు కనీసం ఏడు గంటలైనా నిద్రపోని వారికి త్వరగా ముసలి తనం వస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.