దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ మొదలై పది నెలలు గడిచినా కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశంలో వేల సంఖ్యలో కరోనా కేసులు, వందల సంఖ్యలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి. చైనా దేశంలోని వుహాన్ లో పుట్టి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందిన ఈ మహమ్మారికి చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమించి వ్యాక్సిన్లను తయారు చేయగా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ జరుగుతోంది.
అయితే ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో అనేక దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో కరోనా నుంచి కోలుకున్న వారికి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెల్లడింది. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో వైరస్ ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ పవర్ తో పాటు కొత్తరకం కరోనా వైరస్ లకు కూడా చెక్ పెట్టే సామర్థ్యం ఉందని వెల్లడైంది.
కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో రోగనిరోధక వ్యవస్థ వైరస్ ను గుర్తించడంతో పాటు యాంటీబాడీల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నేచర్ జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురితం అయ్యాయి. 87 మంది రోగులపై పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో వృద్ధి చెందే యాంటీబాడీలు క్షిణించినా కరోనాను గుర్తించే మెమొరీ బీ కణాలను గుర్తు పెట్టుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మెమొరీ బీ కణాల వల్ల కరోనా సోకినా వైరస్ ను ఎదుర్కొనే సామర్థ్యం శరీరానికి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా బారిన పడ్డవారికి కొత్తరకం కరోనా సోకే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.