నిద్ర పట్టని వారికి ఎదురయే సమస్య చికాకు. ఎపనిపై కూడా శ్రధ్ద లేకుండా పోవడం. దీనికి కారణం శరీరంలో నీటిశాతం తగ్గుతుండటమే కారణమని అధ్యయానలు చెబుతున్నాయి. రోజులో కనీసం 6 గంటల కన్నా తక్కువసేపు నిద్రపోయే పెద్దవాళ్ళలలో నీటిశాతం 59% తగ్గే అవకాశం ఉన్నట్లుగా పరిశొదనలు తెలియజేస్తున్నాయి. ఒంట్లో ఉండే నీటి శాతాన్ని మెదడులోని పీయూషగ్రంథి వాసోప్రెసిన్ నియంత్రిస్తోంది. శరీరంలో నీటిని ఎంత పట్టి ఉంచలంటూ మూత్రపిండాలకు సంకేతాలు అందిస్తుంది. అయితే ఒకవేళ నిద్ర తగ్గితే సరైన సమయానికి హర్మోన్ మూత్రపిండాలకు చేరుకోదు. దీంతో మూత్ర పిండాలు నియంత్రణను కోల్పోతుంది. నీరు బయటకు వేళ్ళిపోవడంతో డీహైడ్రేషన్ కలుగుతుంది. అందువల్ల రాత్రి పూట కంటి నిండా నిద్రపోవడం మంచిది. అరోజు నిద్రపట్టినట్లు మీకు అనిపించకపోతే నిద్ర లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగటం ఉత్తమం. దీంతో నీటిశాతం వల్ల వచ్చే దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు.
సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. కంటి నిండా నిద్రపోవడం వల్ల శరీరం తిరిగి శక్తిని కూడగట్టుకుంటుంది. ఆ రోజాంత ఉత్సాహంతో పనిచేస్తారు. ముఖ్యంగా పెద్దల వాళ్ళకు చాలా కీలకం. వారి శరీరం ఎక్కువగా విశ్రాంతిని కోర్కొంటుంది. సరైన సమయంలో నిద్ర, తిండి ఉండాలి. ప్రతిరోజు ఎన్నిపనులున్నప్పటికి ఒకే సమయానికి పడుకుని నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. పడుకునేటప్పుడు నిద్రపట్టకపోతే పుస్తకం చదవటం వంటివి చేయాలి.
ప్రశాంతంగా నిద్రపోండిలంటే ఇలా చేయండి
- నిద్ర పట్టకపోవడానికి అసలు కారణం ఒత్తిడి కావున యోగా, మెడిటేషన్, ప్రాణాయామం నిత్యం చేస్తుండాలి.
- నిద్రపోవడానికి రెండు గంటల ముందు ఆహారం తీసుకోవాలి.
- తీసుకునే ఆహారంలో మసాలా పదార్థాలు ఉండకూడదు. ముఖ్యంగా ఆకు కూరలకు, పండ్లు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
- సరియైన సమయాలలో ఆహారం తీసుకుంటూ సమయానికి నిద్రపోవాలి
- ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి.