Salt -Tumeric : ఉప్పు, పసుపు పూర్తిగా
శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీ ని ఉపాసన చేయడం వలన ధన సమృద్ధి కలగడం తో పాటు,ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అష్టైశ్వర్యాల తో తులతూగాలి అనుకునే వారు శుక్రవారం రోజు అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవికి భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. అదే విధం గా ఇంట పసుపు, ఉప్పు అయిపోయాయి అని మాట కూడా రాకూడదు. పసుపును కొనాలి, ఉప్పును తేవాలి అని అనవచ్చు
ఉప్పు, పసుపు పూర్తిగా అయిపోయేంతవరకు ఉండకూడదు. అవి అయిపోయే లోపు మళ్ళి తెచ్చి పెట్టుకోవాలి. బియ్యాన్ని కొలవడానికి ఉపయోగించే పాత్రను ఎప్పుడు బోర్లించకూడదు.
Salt -Tumeric : ముగ్గులతో అలంకరించి
ఇంట్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నిలిచి ఉండాలంటే, విడిచిన బట్టలను తలుపుకు వేలాడదీయడం వంటివి అస్సలు చేయకూడదు . ఈ రోజు విడిచిన బట్టలను మళ్ళి ఉతకకుండా వేసుకోకూడదు. అందునా శుక్రవారం నాడు విడిచిన బట్టలు వేసుకోవడం వలన దరిద్ర్యం వస్తుంది అని ఆధ్యాత్మిక పండితులు తెలియచేస్తున్నారు. శుక్రవారం రోజు సాత్త్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. పాలను ఎక్కువగా వినియోగించాలి.
శుక్రవారం కచ్చితం గా సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకుని ముగ్గులతో అలంకరించి.. దీపారాధన చేసుకోవాలి.
ప్రతి రోజూ కానీ శుక్రవారం రాత్రిపూట కానీ కొద్దిపాటి అన్నాన్ని ఓ చిన్నపాటి గిన్నెలో వుంచి వంటింట్లో వుంచాలి. ఇలా చేయడం వలన పితరులు, దేవతలు ఆ ఇంట అన్నం ఎప్పుడు సంవృద్ధిగా ఉండాలి అని దీవిస్తారట.
ఈ కుంకుమను నుదుటన
శుక్రవారం రోజు నుదుట కుంకుమ బొట్టు ధరించే వారికి కలకాలం సౌభాగ్యం తో ఉంటారట. స్టిక్కర్లను పెట్టుకోకుండా తెల్ల వక్కలతో చేసుకున్న కుంకుమను శుక్రవారం రోజు పెట్టుకుంటే మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా పొందగలుగుతారు.
తెల్ల వక్కలను తీసుకుని నేతిలో వేయించుకుని మెత్తని పొడి గా చేసి ఆ మిశ్రమానికి కస్తూరి పొడి తో పాటు కుంకుమ పువ్వు పొడిని కూడా కలిపి చూర్ణం చేసుకుంటే కుంకుమ తయారవుతుంది. ఈ కుంకుమను నుదుటన పెట్టుకోవడం వలన సుగంధ భరితమైన సువాసన రావడం తో పాటు శుక్రుని అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది. ఆ విధం గా పెట్టుకోవడం వలన ధనవృద్ధి కూడా కలుగుతుంది.