కాలం మారుతున్న కొద్ది మానవ జీవన శైలి, ఆహారపు ఆలవాట్లు, ఉండే పరిస్థితుల్లో మార్పులు చాలానే చోటుచేసుకున్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఉరుకుక పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లలో వచ్చిన మర్పుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, శరీరానికి అవసరమైన విటవమిట్లు, పోషకాలు లేని ఆహారం తీసుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో పాటు అనేక రకాలైన అనారోగ్య సమస్యలు రావడం ఖాయం. కరోనా పుణ్యమా అని మళ్లీ అందరూ తమ ఆహార అలవాట్లలో మార్పులు తీసుకుంటూ.. పోషకాలు ఉంగే ఆహారంపై మొగ్గు చూపుతున్న సంగతి తెలిసందే.
అయితే, మన శరీరంలో జీవక్రియలు సంక్రమంగా జరగాలంటే సూక్ష్మపోషకాలు సైతం కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో ఆయోడిన్ అత్యంత కీలకం. ఎందుకంటే ఈ సూక్ష్మ పోషకాన్ని మన గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంధి ఉపయోగించుకుని థైరాక్సిన్ హర్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. దీని ద్వార శరీరంలో జీవ క్రియలు సక్రమంగా జరుగుతాయి. అయితే, శరీరానికి తగినంత అయోడిన్ లభించకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
ముఖ్యంగా గర్భిణీలకు అయోడిన్ లోపం ఉంటే పుట్టబోయే పల్లల్లో శరీరక పెరుగుదల లోపిస్తుంది. మానసిక సమస్యలు, తక్కువ బరువుతు శిశువులు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే, ప్రసవ సమయంలో తల్లి కడుపులోనే బిడ్డ చనిపోయి పుట్టడం కూడా జరుగుతుంది. గర్భస్రావం సైతం జరిగే అవకాశాలు లేకపోలేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శైశవ దశలో ఉన్నప్పుడు సైతం అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిలో గాయిటర్, గొంతువాపు, అంగ వైకల్యం, మానసిక వికాస స్థంభన, మరగుజ్జుతనం ఉన్నాయి. అలాగే, యుక్త వయస్సు వారిలోనూ ఆయోడిన్ లోపం అనేక రోగాలకు కారణమవుతుంది. సాధారణంగా ఒక వ్యక్తికి రోజుకు 150 మైక్రో గ్రాములు అయోడిన్ అవసరమవుతుంది. అదే, గర్భవతి/పాలిచ్చే తల్లికి అయితే 250 మైక్రో గ్రాములు, శిశులకు 50 మైక్రో గ్రాములు, బడి పిల్లలకు 120 మైక్రో గ్రాములు అవసరమవుతుంది.
దేశంలో దాదాపు 200 మిలియన్ల మంది అయోడిన్ లోపంతో బాధపడుతున్నట్టు అంచనా. వీరిలో ఎక్కువగా గ్రామీణ మహిళలే బాధితులుగా ఉన్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. దీనిని గమనించిన కేంద్ర అయోడిన్ అభించే ఉప్పును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉప్పుతో పాటు నెలలో పండించిన పంటల్లో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. వాటిని తీసుకోవడం ద్వారా శరీరంలో అయోడిన్ లోపం ఉండదు.