Breakfast: ప్రతి ఒక్కరి రోజువారీ ఆహారంలోటిఫిన్ చాలా ముఖమైనది. ఎందుకంటే ఉదయం పూట అల్పాహారం తింటేనే రోజంతా ఎంతో ఎనర్జీగా ఉంటాము. అయితే చాలా మంది రకరకాల కారణాల వలన ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తున్నారు. కానీ అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.నిజానికి ఉదయం పూట అల్పాహారం తినే వారితో పోల్చితే టిఫిన్ మానేసే వారిలోనే గుండె సంబంధిత జబ్బులతో పాటుగా గుండెపోటు కూడా వచ్చే అవకాశాలు 27 శాతం ఎక్కువ అని పరిశోధనలో తెలిసింది.అలాగే టిఫిన్ మానేయడంతో పాటుగా సరైన సమయానికి అల్పాహారం తీసుకోకపోయినా గాని ఆరోగ్య సమస్యలు వస్తాయట.ముఖ్యంగా తలనొప్పి సమస్య వచ్చే ప్రమాదముంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినకపోతే కలిగే నష్టాలు :
అలాగే బ్రేక్ఫాస్ట్ మానేస్తే కొన్ని రకాల క్యాన్సర్ల.బారిన పడే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు..ముఖ్యంగా టీనేజీ పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినకపోతే వారి యొక్క ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుంది.ఏ విషయంపై కూడా ఏకాగ్రత చూపలేక మంచి ఫలితాలు సాధించలేరు. అంతేకాకుండా ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ తినకుండా డైరెక్ట్ గా భోజనం చేయడం. వలన కొన్ని రోజుల తర్వాత రక్తహీనత సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మద్యం సేవించే వారు తప్పక టిఫిన్ చేయాలా..? ఎందుకు..?
ఎవరికయితే మద్యం సేవించే అలవాటు ఉంటుందో వారు కనుక ఉదయం అల్పాహారం తినకపోతే హ్యాంగోవర్ సమస్య మరి అధికం అవుతుంది ఫలితంగా షుగర్ లెవెల్స్ పడిపోతాయి.అందుకే రాత్రి పూట మద్యం సేవించిన వారు ఉదయం పూట తప్పనిసరిగా టిఫిన్ చేయాలి. అలాగే ఈ కాలంలో ప్రతి ఒక్కరు ఎదురుకునే ప్రధాన సమస్యల్లో అధిక బరువు ఒకటి.ముఖ్యంగా యూత్ అయితే సన్నగా అవ్వాలని బ్రేక్ఫాస్ట్ మానేస్తున్నారు. నిజానికి ఇలా చేయడం వలనే బరువు పెరిగే అవకాశం ఉందని చాలా రకాల అధ్యయనాలు చెబుతున్నాయి.
టిఫిన్ మానేస్తే బరువు పెరుగుతారా.. తగ్గుతారా??
ఉదయం పూట ఏమి తినకపోవడం వలన మధ్యాహ్నం భోజనం కాస్త ఎక్కువ తినేస్తాము ఫలితంగా బరువు పెరిగిపోతారు.ఉదయం పూట అల్పాహారం తీసుకోవడం మానేస్తే జుట్టు త్వరగా ఊడిపోయి చిన్న వయసులోనే బట్టతల వస్తుంది. బ్రేక్ఫాస్ట్ వల్లే జట్టుకు కావలసిన పోషకాలు సమపాళ్ళలో అందుతాయి అని మర్చిపోకండి. అలాగే బ్రేక్ఫాస్ట్ మానేసే వారిలో జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.దాదాపుగా ఒక ఏడు గంటల పాటు ఏమి తినకుండా ఉండడం వలన శరీరంలో శక్తి కోల్పోయి తరచుగా అలసటకు గురవుతాము. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఉదయం పూట అల్పాహారం తినడం అసలు మానకండి..!