మనిషి కి ప్రతి రోజు 6 నుంచి 8 గంటల పాటు నిద్రించడం అనేది చాల అవసరం అని వైద్యులు చెబుతుంటారు. అలా నిద్రపోయినట్టయితే మంచి ఆరోగ్యం కలుగుతుంది . అయితే రోజూ 8 గంటలకన్న ఎక్కువ గంటలు నిద్రించే వారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే మన శరీరానికి నిద్ర చాల అవసరమే అయినా కూడా అది ఎక్కువైతే మాత్రం ఎలాంటి ప్రయోజనము కలుగక పోగా ఆరోగ్య పరంగా అన్నీ నష్టాలే ఎదురవుతాయి. అతిగా నిద్రపోతే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో ఇప్పుడు చూద్దాం ..
ఎక్కువ గా నిద్రపోయేవారిలో గుండె అసాధారణ రీతి లో కొట్టుకోవడం,నిరాశ, మానసిక సమస్యలు, తదితర లక్షణాలు కనిపిస్తాయి. రోజుకు 8 గంటల కన్న మించి ఎక్కువగా నిద్రించే వారికి గుండె జబ్బులుమధుమేహం , హై బీపీ, వస్తాయని సైంటిస్టులు చేసిన కొన్ని తాజా అధ్యయనాల్లో బయట పడింది.
అతి నిద్ర వల్ల శరీరం కొవ్వును ఎక్కువగా నిల్వ చేయడం వలన బరువు పెరిగిపోతారు . ఎప్పుడూ అలసటగానే ఉంటుంది. ఏ పనీ మీద శ్రద్ధ ఉండదు, చేయబుద్ది కూడా కాదు. చిన్న పని చేసి కూడా అలసిపోతుంటారు.
తలనొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలుఏర్పడడం తో పాటు గుండె జబ్బులు, డయాబెటిస్ వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.
ఎక్కువ నిద్రపోయే వారిలోవృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపిస్తాయి. స్త్రీ, పురుషులు ఇద్దరిలో నూ సంతాన సాఫల్యత సమస్యలు తలెత్తుతాయి.
ప్రతి రోజుమోతాదుకు మించి నిద్రించే వారు త్వరగా చనిపోయే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి అలవాటు ఉన్నవారు మనుకోవడాని ప్రయత్నం చేయడం అవసరం.